కియారా అడ్వాణీ పదేళ్ల అంతరంగం!

హిందీ సినిమా 'ఫగ్లీ’తో కథానాయికగా పరిచయమయ్యారు కియారా అడ్వాణీ.

'భరత అనే నేను’ చిత్రంతో  తెలుగు తెరకు పరిచయమై గుర్తింపు తెచ్చుకుంది.

కథానాయికగా ఆమె పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా  ఫ్రెండ్స్ తో  కలిసి సెలబ్రేట్ చేసుకుంది. తన అంతరంగాన్ని బయటపెటింది.

నటిగా ఎదగాలనే లక్ష్యంతో నాకు 21 ఏళ్లు ఉన్నప్పుడు సినీ కెరీర్‌ను ప్రారంభించాను.

అప్పుడు నేనేం చేస్తున్నానో.. ప్రేక్షకులకు ఎలా దగ్గరవ్వాలో కూడా తెలియదు.

ఎలాంటి సినిమాలని ఎంచుకోవాలో అవగాహన లేదు. గైడ్‌ చేసేవాళ్లు లేరు.

నా పదేళ్ల ప్రయాణంలో జీవితంలో  పైకి ఎలా ఎదగాలో నేర్చుకున్నాను.

కథల ఎంపికలో మార్పులు చేస్తూ.. కుటుంబంతో కలిసి చూసేలా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నా ముందున్న లక్ష్యం ఇదే!

ఈ ప్రయాణంలో ఎన్నో మరచిపోలేని జ్ఞాపకాలు పోగేసుకున్నా. ఇప్పటికీ ప్రతి రోజు కొత్తగానే ఉంటుంది.

ప్రేమ, కలలు, చిరునవ్వులు, కన్నీళ్లు.. ఇలా ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నాను.

నా లక్ష్యాన్ని సాధించడానికి సహకరించిన దర్శక నిర్మాతలకు సహనటులు, ఫ్యాన్స్ కు  ఎప్పటికీ రుణపడి ఉంటా.

 కియారా తెలుగులో 'గేమ్‌ ఛేంజర్‌' చిత్రంలో నటిస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల   చేయనున్నారు