కీర్తి సురేష్ గురించి  ఈ విషయాలు తెలుసా..

సినీ నేపథ్య కుటుంబం  కావడంతో  తెరంగేట్రం తేలికైనా తర్వాత  ప్రయాణం  అనుకున్నంత సాఫీగా సాగలేదు

 మూడు నాలుగు సినిమాలు ఆగిపోవడంతో ఐరన్‌లెగ్‌  ముద్ర పడింది.  దాని నుంచి బయటపడి  ఈతరం మహానటి  అనిపించుకున్నారు.

‘నేను.. శైలజ’తో తెలుగు  ప్రేక్షకులకు పరిచయమై మంచి విజయాన్ని అందుకున్నారు. ఇటు టాలీవుడ్‌లో.. అటు  కోలీవుడ్‌లో అవకాశాలు  వరించాయి.

కమర్షియల్‌ మూవీస్‌ చేసుకుంటూ  వెళ్తున్న ఆమెలోని అసలైన నటిని  బయటకు తీసుకొచ్చిన చిత్రం  ‘మహానటి’

సావిత్రి పాత్ర కోసం ముందుగా  వేరే హీరోయిన్లను అనుకున్నా..  కీర్తికే  రాసిపెట్టుంది అన్నట్లు  ఆ ఛాన్స్‌  కీర్తి సురేష్ కు దక్కింది. .

పెద్ద ప్రాజెక్టు.. ఓవర్‌నైట్‌ స్టార్‌  అయిపోవచ్చని ఎగిరి  గంతేలేయలేదు.  సావిత్రిగా నటించాలనే ఆలోచనే  ఆమెను భయపెట్టింది.

ప్రేక్షకుల హృదయాల్లో చెరగని  ముద్ర వేసుకున్న సావిత్రి పాత్రకు  తాను న్యాయం చేయలేకపోతే..  అప్పటి వరకూ ఉన్న పేరు కూడా  పోయే ప్రమాదముందనుకున్నారు.

‘మీరు చేయగలరు..’ అంటూ ఆ  చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌  ప్రోత్సహించడంతో  ధైర్యంగా ముందడుగేశారు

‘మహానటి’ తర్వాత    ‘సామి స్క్వేర్‌’, ‘పందెం కోడి 2’ వంటి సినిమాలు ప్రేక్షకుల  అంచనాలు అందుకోలేదు

లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌ ‘పెంగ్విన్‌’,  ‘మిస్‌ ఇండియా’, ‘గుడ్‌లక్‌ సఖి’  చిత్రాలూ  సందడి చేయలేకపోయాయి.

గతేడాది విడుదలైన ‘దసరా’,  ‘మామన్నన్‌’తో మళ్లీ సక్సెస్‌  ట్రాక్‌లోకి వచ్చారు.

‘బేబీ జాన్‌’ (Baby John)తో  బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

‘సామి స్క్వేర్’లో పుదు మెట్రో రైల్‌  సాంగ్‌తో ఉర్రూతలూగించిన కీర్తి   ‘కల్కి 2898 ఏడీ’ లో బుజ్జి  వాహనానికి వాయిస్‌ అందించారు.

చిరంజీవి ‘పున్నమినాగు’  సినిమాలో హీరోయిన్‌గా  మేనక నటించగా.. ‘భోళా శంకర్‌’లో  ఆయనకు చెల్లిగా కీర్తి సురేశ్‌  నటించారు.