జాన్వీ కపూర్ పెళ్లి ఫిక్స్ అయ్యిందా..  వరుడు ఎవరంటే

బాలీవుడ్ బ్యూటీ,  అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పెళ్లి ఫిక్స్ అయినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

జాన్వీ తన చిరకాల మిత్రుడు శిఖర్ పహారియా డేటింగ్ లో ఉన్నట్లు సీన్ వర్గాలలో టాక్.

వీళ్లిద్దరు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

చెన్నైలోని ఐటీసీ చోళాను వివాహ వేదికగా నిర్ణయించినట్లు సమాచారం.

ఈ జంట ప్రతియేడు శ్రీదేవి పుట్టినరోజు నాడు తిరుపతిలో సందడి చేసిన విషయం తెలిసిందే.

ఇటీవల జరిగిన ఓ వేడుకలో జాన్వీ.. తన పేరుతో పాటు శిఖర్ పేరున్న నెక్లెస్ ధరించింది.

 వీరిద్దరూ కలిసి అనేక ఫిల్మ్స్ ఈవెంట్స్‌కి కూడా హాజరు అయ్యారు.

ట్విన్నింగ్ డ్రెస్‌లతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేశారు.