కీర్తి సురేశ్‌ సినిమాలో  కనిపించి ఏడాదిన్నర పైనే అయింది.

బాలీవుడ్‌, కోలీవుడ్‌ ప్రేక్షకులను మాత్రం అలరించింది కీర్తి సురేశ్‌

బలగం చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగులోనే సినీప్రియుల్ని మెప్పించారు వేణు యెల్దండి.

దర్శకుడి వేణు యెల్దండి తదుపరి సినిమాగా నితిన్‌తో ఎల్లమ్మ పట్టాలెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

నాయికగా సాయిపల్లవి కనిపించనున్నట్లు వార్తలొచ్చినప్పటికీ.డేట్లు సమస్యతో ఆమె తప్పుకొన్నట్లు సమాచారం. 

 ఆ పాత్ర కోసం దర్శకుడు వేణు.. కీర్తి సురేశ్‌ను సంప్రదించారని సమాచారం.

కీర్తికి ఇప్పటికే కథ వినిపించారని.. త్వరలోనే ఆమె నుంచి సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

ఒకవేళ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఇది నితిన్‌ - కీర్తిల కాంబోలో రెండో సినిమా అవుతుంది.