నేహా కక్కార్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

నేహాకక్కార్‌ ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో జన్మించారు. చిన్నప్పటి నుంచి సంగీతం మీద ఇంట్రెస్ట్‌ ఎక్కువ.

తన సోదరుడు టోనీ కక్కార్‌తో కలిసి ఢిల్లీకి షిప్ట్‌ అయ్యి మ్యూజిక్‌ మీద దృష్టిపెట్టారు.  2008లో తన తొలి ఆల్బమ్‌ను విడుదల చేశారు.

అక్కడి నుంచి ఎన్నో హిట్‌ సినిమాల్లో ఆమె పాడారు. హిందీ, నాన్ హిందీ, బంగ్లా ఇలా పలు భాషల్లో 300లకు పైగా పాటలు పాడారు.

ఆమె పాడిన 'కాలా ఛష్మా' సాంగ్‌ ఎంత పాపులర్‌ అయిందో తెలిసిందే. పలు ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ చేయడమే కాకుండా సినిమాల్లోనూ మెరిశారు.

పలు సింగింగ్‌ కాంపిటీషన్ లకు  న్యాయనిర్ణేతగా కూడా ఉన్నారు. ఇండియన 12వ సీజన్ కు  ఆమె జడ్జ్‌గా ఉన్నారు.

యూట్యూబ్‌ డైమండ్‌ అవార్డ్‌ అందుకున్న తొలి భారతీయ సింగర్‌గా గుర్తింపు పొందింది.

ఫోర్బ్‌ ఇండియా సెలబ్రిటీ కేటగిరీలో ఆసియాలో ఆమె 100వ స్థానాన్ని సంపాదించుకున్నారు.

నటుడు హిమాన్షు కోహ్లీతో ప్రేమలో ఉన్నానని ప్రకటించిన ఆమె మూడు నెలల్లోనే బ్రేకప్‌ చెప్పుకున్నారు. 2020లో సింగర్‌ రోహన్  ప్రీత్ సింగ్‌ను పెళ్లాడింది.

ప్రస్తుతం సింగర్‌గా కొనసాగుతూనే సూపర్‌సింగర్స్‌ కాంపిటీషన్ కు  న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.