రాజ్ త‌రుణ్‌తో ఎఫైర్‌.. మాల్వి గురించి ఈ విష‌యాలు తెలుసా!

ప్ర‌స్తుతం తెలుగు రాష్టాల్లో బాగా ట్రెండింగ్‌లో ఉన్న న‌టి మాల్వి మల్హోత్రా

రాజ్ త‌రుణ్‌తో ఎఫైర్ ఉంద‌న్న వార్త‌ల‌తో హాట్ టాపిక్‌గా మారింది

మాల్వి హిమాచల్ ప్రదేశ్‌ మండిలో ఒక పంజాబీ కుటుంబంలో పుట్టింది

చదువంతా చండీగఢ్‌లో సాగింది, తరువాత ముంబాయి షిఫ్ట్ అయింది

యూనివర్సిటీ అఫ్ ముంబైలో మాస్టర్స్ ఇన్ కంప్యూటర్స్ చేసింది

2017లో ఉడాన్ అనే హిందీ సీరియల్‌తో న‌టిగా ఆరంగేట్రం చేసింది

ఆమె న‌టించిన తొలి చిత్రం 'హోటల్ మిలన్' 2018లో విడుదలైంది

నాలుగేళ్ల తరువాత షార్ట్ ఫిలిం 'తమస్', ఓ వీడియోలో న‌టించింది

ఇక‌ 2022లో ఓటీటీ సినిమాలో నటించింది కానీ గుర్తింపు రాలేదు

2023లో 'అభ్యుహం' సినిమాతో మలయాళంలో అరంగేట్రం చేసింది

అదే సంవత్సరం రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన‌

'తిరగబడరా స్వామి' సినిమాతో తెలుగులో అరంగేట్రం చేస్తోంది

ఆగ‌స్టు2 న ఈ సినిమా   ప్రేక్ష‌కుల ముందుకు రానుంది

ఈ సినిమా స‌మ‌యం నుంచే మాల్వి మల్హోత్రా రాజ్ త‌రుణ్‌తో

క‌లిసి ఉంటున్నట్టుగా రాజ్ త‌రుణ్ ప్రియురాలు లావ‌ణ్య బాంబ్ పేల్చింది

ఈ విష‌య‌మై లావ‌ణ్య పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి కేసు కూడా పెట్టింది

అయితే ఈ ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తూ రాజ్ తరుణ్ ప్రెస్మీట్ సైతం పెట్టాడు

మాల్వి తనకి దగ్గరి స్నేహితురాలు మాత్ర‌మేన‌ని తెలిపాడు

లావ‌ణ్య అన్ని అవాస్త‌వాలే చెబుతుంద‌ని మాల్వి పేర్కొంది

 ఆ త‌ర్వాత ఒక‌రిపై  ఒక‌రు కేసులు పెట్టుకోవ‌డంతో

ఈ స్టోరీ రోజుకో మ‌లుపు తిరుగుతోంది

లావ‌ణ్య‌ పెట్టిన కేసులో రాజ్ తరుణ్‌ని ఏ1గా, మాల్విని ఏ2గా,

ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రాను ఏ3గా పేర్కొన్నారు

ప్ర‌స్తుతం ఈ కేసును  పోలీసులు ద‌ర్యాప్తు చేస్తుండ‌గా..

ఈ ముక్కోణపు ప్రేమకథలో అసలు నిజం ఏంటనేది తెలియాల్సి ఉంది

ఈ వివాదం త్వ‌ర‌లో విడుద‌ల  కానున్న'తిరగబడరా స్వామి' సినిమాకు

ఏమైనా ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా అనే చర్చ నడుస్తోంది

ఇదిలా ఉండగా ఈ ముద్దుగుమ్మ తాజాగా నటించిన షబానో అనే ఓ తెలుగు మ్యూజిక్ వీడియో విడుదలైంది

అయితే 2020లో ముంబైలో మాల్వీపై నిర్మాత యోగేష్ దాడి చేసిన ఘటన  విష‌యాలు ఇప్పుడు బ‌య‌ట‌కొచ్చాయి

తాజాగా యోగేశ్ త‌ల్లి మాల్వీపై చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి

ప్రేమ పేరుతో మాల్వి త‌న కుమారుడిని ట్రాప్ చేసి ఆస్తంతా కాజేసింద‌ని

త‌ప్పుడు కేసు పెట్టి జైలుకు పంపిందంటూ ఆరోప‌ణ‌లు చేసింది

అయితే ఈ ఆరోపణలపై ఇంతవరకూ రాజ్ తరుణ్, మాల్వీ స్పందించలేదు