రాజ్ త‌రుణ్‌పై.. లావ‌ణ్య షాకింగ్ కామెంట్స్‌

రాజ్ తరుణ్‌పై లావణ్య పెట్టిన కేసుతో ..

రోజురోజు కొత్త ట్విస్టులు బైటకి వస్తున్నాయి

పోలీసులకు లావ‌ణ్య‌ ఆధారాలు ఇవ్వ‌టంతో 

నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్ పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఏ1గా పేర్కొన్నారు

మాల్వి మల్హోత్రాని ఏ2గా, ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రాను ఏ3గా చేర్చారు 

 ఆ ముగ్గురిపై 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా తెలిసింది

ఇప్పుడు ఇంకొక కొత్త ట్విస్టు  కూడా ఈ కేసులో బయట పడింది

2008లో ప‌రిచ‌యం కాగా 2010లో ప్ర‌పోజ్ చేశాడ‌ని 2014లో గుడిలో పెళ్లి చేసుకున్న‌ట్లు లావణ్య తెలిపింది

తర్వాత గర్భవతిని అయితే రెండో నెలలో తీసివేయించాడని ఆ ఖర్చులన్నీ రాజ్ తరుణ్  పెట్టుకున్నట్లు తెలిపింది

మాల్వి ఎంటర్ అయ్యాక నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించారని, చంపుతామని బెదిరించారని చెప్పింది

ఇప్పటివరకు రాజ్ తరుణ్ కి రూ.70 లక్షల వరకు ఇచ్చాన‌ని, ఆత‌నికి కుక్కలంటే ఇష్టమ‌ని 15 కుక్కలను పెంచుకుంటున్నామ‌ని 

దాని వ‌ళ్ల 6 సంవత్సరాల్లో 6 ఇల్లులు మార్చాల్సి వచ్చిందని చెప్పింది లావణ్య

మస్తాన్ తో లావణ్యకి సంబంధం ఉందని  చెప్పిన రాజ్ తరుణ్ ఆధారాలు ఉంటే తీసుకురావాలని లాయర్ అడిగాడు

లావణ్యకి డబ్బులు, ఏమీ వద్దని రాజ్ తరుణ్ వచ్చి కోపంలో ఎదో మాట అన్నాను, నింద వేశాను,

లావణ్య నా భార్య, నేను ఏలుకుంటానని చెపితే రాజ్ తరుణ్ పై అన్ని కేసులు

ఉపసంహరించుకుంటుందని లావణ్య లాయర్ కళ్యాణ్ దిలీప్ తెలిపారు