రొమాంటిక్.. దెబ్బకి భోజనం మానేశా..

సంజయ్‌లీలా భన్సాలీ తీర్చిదిద్దిన వెబ్‌సిరీస్‌ ‘హీరామండీ:ద డైమండ్‌ బజార్‌’లో 

బిబ్బోజాన్‌ పాత్రలో మెప్పించారు నటి అదితీరావు హైదరీ. 

భోజనం మానేసి ఈ వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొన్నారట అదితీరావు హైదరీ. 

ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అదితి వెల్లడించారు. 

‘సెట్లో కొన్ని సార్లు భావోద్వేగ సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు 

చేయమంటే నేను వాటిని రొమాంటిక్‌గా చేశాను.

ఎంత ప్రయత్నించినా అవి సహజంగా రాలేదు. 

ఆకలితో చేస్తే భావోద్వేగ సన్నివేశాలు మెరుగ్గా వస్తాయని 

భోజనం మానేయమని సలహా ఇచ్చారు దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ సార్. 

ఇది నాకు చాలా ఉపయోగపడింది. 

సిరీస్‌ షూటింగ్‌ పూర్తయ్యే వరకూ ఆ సలహానే పాటించాను’ అని ఆమె చెప్పుకొచ్చారు.