‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’.. డైరెక్ట్‌గా ఓటీటీలోనే!

ABN , First Publish Date - 2021-12-05T00:26:44+05:30 IST

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ‌ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహన్ ద‌ర్శ‌కత్వంలో రామంత్ర క్రియేష‌న్స్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ‌‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’(ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు). ఫస్ట్‌ టైమ్..

‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’.. డైరెక్ట్‌గా ఓటీటీలోనే!

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ‌ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహన్ ద‌ర్శ‌కత్వంలో రామంత్ర క్రియేష‌న్స్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ‌‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’(ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు). ఫస్ట్‌ టైమ్ కంప్యూటర్‌ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల‌కానుంది. ఈ చిత్ర డిజిట‌ల్ రైట్స్‌ని సోని లివ్ సంస్థ ఫ్యాన్సీ మొత్తానికి ద‌క్కించుకున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అతి త్వ‌ర‌లో ఈ చిత్రం సోనిలివ్‌లో ప్ర‌సారం కానుంది. 


ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత డా. రవి ప్రసాద్ రాజు దాట్ల మాట్లాడుతూ.. ‘‘మా ఫ‌స్ట్ మూవీకి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌కులుగా వ్యవ‌హరించ‌డంతో టీమ్ అంతా చాలా హ్యాపీగా ఉన్నాం. ఫస్ట్‌ టైమ్ తెలుగులో వస్తోన్న కంప్యూటర్‌ స్క్రీన్ బేస్డ్‌ మూవీ ఇది. ఓటీటీకి ప‌ర్‌ఫెక్ట్ ఛాయిస్‌. సోనివంటి ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ‌తో అసోసియేట్ అవ‌డం చాలా హ్యాపీ. ఈ సినిమా సోని లివ్ ద్వారా మ‌రింత ఎక్కువ మందికి చేరుతుందని ఆశిస్తున్నాం. గుహ‌న్‌గారి మేకింగ్.. అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్ కెమిస్ట్రి అన్ని వ‌ర్గాల‌వారిని ఆక‌ట్టుకుంటుంది. ఈ సినిమా సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది..’’ అని అన్నారు.

Updated Date - 2021-12-05T00:26:44+05:30 IST