'ఆడవాళ్లు మీకు జోహార్లు': ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..

ABN , First Publish Date - 2022-04-02T15:05:06+05:30 IST

యంగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. తిరుమల కిషోర్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ డ్రామా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.

'ఆడవాళ్లు మీకు జోహార్లు': ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..

యంగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. తిరుమల కిషోర్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ డ్రామా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం మార్చి 4న థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. కాగా, ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను తాజాగా ప్రకటించారు. సోనీ లివ్ ప్లాట్‌ ఫారమ్‌లో ఏప్రిల్ 14 నుండి ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం స్ట్రీమింగ్ కాబోతున్నట్టు ప్రకటించారు. ఇందులో ఖుష్బు, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి ముఖ్య పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. మరి ఓటీటీ ప్రేక్షకుల్ని ఏ మేరకు ఈ సినిమా ఆకట్టుకుంటుందో చూడాలి.  

Updated Date - 2022-04-02T15:05:06+05:30 IST