విదేశాలకు వెళ్లకుండా...
ABN , First Publish Date - 2021-12-06T06:43:31+05:30 IST
బాలీవుడ్ కథానాయిక జాక్వెలిన్ ఫెర్నాండేజ్ విదేశాలకు వెళ్తుండగా ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటూ జైల్లో ఉన్న సుఖేష్ చంద్ర శేఖర్ నుంచి జాక్వెలిన్ రూ. 10 కోట్ల...
బాలీవుడ్ కథానాయిక జాక్వెలిన్ ఫెర్నాండేజ్ విదేశాలకు వెళ్తుండగా ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటూ జైల్లో ఉన్న సుఖేష్ చంద్ర శేఖర్ నుంచి జాక్వెలిన్ రూ. 10 కోట్ల విలువైన బహుమతులు అందుకున్నారనే ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆమెను గతంలో పలుమార్లు విచారించింది. అయితే తాజాగా జాక్వెలిన్, సుఖేష్తో సన్నిహితంగా మెలిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం ఆమెకు చిక్కులు తెచ్చిపెట్టింది. కేసు ఇంకా విచారణలో ఉండడం, ఆమెపై ఈడీ లుక్ అవుట్ నోటీస్లు ఉండడంతో దేశం వదిలివెళ్ళకుండా అధికారులు అడ్డుకున్నారు.