ముగ్గురమ్మాయిలతో...

ABN , First Publish Date - 2021-07-11T07:13:50+05:30 IST

కొత్త సినిమాలో ముగ్గురమ్మాయిలతో ధనుష్‌ రొమాన్స్‌ చేయనున్నారని చెన్నై కోడంబాక్కమ్‌ ఖబర్‌. ‘యారాద నీ మోహిని’, ‘ఉత్తమ పుథిరన్‌’ ఫేమ్‌ మిత్రన్‌ జవహర్‌ దర్శకత్వంలో...

ముగ్గురమ్మాయిలతో...

కొత్త సినిమాలో ముగ్గురమ్మాయిలతో ధనుష్‌ రొమాన్స్‌ చేయనున్నారని చెన్నై కోడంబాక్కమ్‌ ఖబర్‌. ‘యారాద నీ మోహిని’, ‘ఉత్తమ పుథిరన్‌’ ఫేమ్‌ మిత్రన్‌ జవహర్‌ దర్శకత్వంలో ధనుష్‌ ఓ సినిమా చేయనున్నారు. అందులో హీరోయిన్లుగా హన్సిక, నిత్యా మీనన్‌, ప్రియ భవానీశంకర్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయట. అసలు విశేషం ఏంటంటే... ఈ సినిమాకు ధనుష్‌ కథ రాస్తున్నారట. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. ఈ ఏడాదే సినిమా సెట్స్‌కు వెళ్తుందని టాక్‌. ప్రస్తుతం తమిళంలో కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వంలో ధనుష్‌ ఓ సినిమా చేస్తున్నారు. అలాగే, అన్నయ్య సెల్వ రాఘవన్‌తో మరో సినిమా ఉంది. ఈ రెండూ పూర్తయ్యాక... మిత్రన్‌ జవహర్‌ సినిమా పట్టాలు ఎక్కుతుందా? లేదంటే తెలుగు దర్శకుడు శేఖర్‌ కమ్ములతో అంగీకరించిన పాన్‌ ఇండియా సినిమాను ముందు పట్టాలు ఎక్కించి, ఆ తర్వాత తమిళ సినిమా చేస్తారా? అనేది చూడాలి. శేఖర్‌ కమ్ములతో పాటు మరో తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాణంలో ధనుష్‌ సినిమా చేస్తారని సమాచారం. దానిని ఇంకా ప్రకటించలేదు.


Updated Date - 2021-07-11T07:13:50+05:30 IST