అమ్మాయిల అదృశ్యం వెనుక ఉన్నదెవరు?

ABN , First Publish Date - 2021-08-11T06:19:40+05:30 IST

తనకు కాబోయే భార్య కనిపించడంలేదని ఒకరు కంప్లయింట్‌ ఇచ్చారు. ఇంకొకరు మూడు రోజులుగా గాళ్‌ఫ్రెండ్‌ కనిపించడం లేదని! అమ్మాయిల అదృశ్యం వెనుక ఉన్నదెవరు...

అమ్మాయిల అదృశ్యం వెనుక ఉన్నదెవరు?

తనకు కాబోయే భార్య కనిపించడంలేదని ఒకరు కంప్లయింట్‌ ఇచ్చారు. ఇంకొకరు మూడు రోజులుగా గాళ్‌ఫ్రెండ్‌ కనిపించడం లేదని! అమ్మాయిల అదృశ్యం వెనుక ఉన్నదెవరు? ఓ క్వారీలో గుట్టలుగా శవాలు పడటానికి కారణం ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానాలు మా సినిమా చూసి తెలుసుకోవాలని సుబ్బు వేదుల అన్నారు. ‘రాహు’ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన సినిమా ‘బొమ్మల కొలువు’. ‘రఘువరన్‌ బీటెక్‌’లో ధనుష్‌ తమ్ముడిగా నటించిన రిషికేశ్‌ ఇందులో హీరో. ప్రియాంకా శర్మ, మాళవికా సతీశన్‌ హీరోయిన్లు. ఏవీఆర్‌ స్వామి నిర్మించారు. కోన వెంకట్‌, బీవీఎస్‌ రవి మంగళవారం సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు. ‘‘సుబ్బు అమెరికాలో ఓ బ్యాంకు ఉపాధ్యక్షుడిగా పని చేశాడు. తనలో ప్రతిభ ఉందని నేను చెప్పిన మాటల వల్ల ఉద్యోగం వదిలి వచ్చేశాడు. నాకు గిల్టీగా అనిపించింది. కొన్నాళ్లకు ‘రాహు’ చేశాడు. ఇప్పుడీ సినిమా. దాంతో నాకు ధైర్యంగా ఉంది. తను మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నా’’ అని కోన వెంకట్‌ చెప్పారు. ‘‘కరోనా కాలంలో మూడు చిత్రాలు పూర్తి చేశాం. అందులో ఇదొకటి. దర్శకుడు మల్లాద్రి అప్పన్నతో ఒకటి, భానుశర్మతో మరొకటి చేశాం. మూడూ ఈ నెలలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాత ఏవీఆర్‌ స్వామి తెలిపారు.


Updated Date - 2021-08-11T06:19:40+05:30 IST