విరాటపర్వానికి విముక్తి ఎప్పుడు?
ABN , First Publish Date - 2022-04-18T02:42:19+05:30 IST
రానా, సాయిపల్లవి కీలక పాత్రధారులుగా వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన చిత్రం ‘విరాటపర్వం’. ప్రియమణి కామ్రేడ్ భారతక్కగా, జరీనా వాహెబ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా మేకింగ్, టీజర్లు విడుదలైనప్పుడు సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈలోపు కరోనా కలకలం సృష్టించడంతో సినిమా షూటింగ్ ఆగింది.
రానా, సాయిపల్లవి కీలక పాత్రధారులుగా వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన చిత్రం ‘విరాటపర్వం’. ప్రియమణి కామ్రేడ్ భారతక్కగా, జరీనా వాహెబ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా మేకింగ్, టీజర్లు విడుదలైనప్పుడు సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈలోపు కరోనా కలకలం సృష్టించడంతో సినిమా షూటింగ్ ఆగింది. కరోనా పరిస్థితులు కాస్త తగ్గడంతో మిగిలిన షెడ్యూళ్లు పూర్తి చేశారు. కరోనా పరిస్థితులు సర్దుకోవడంతో చాలా చిత్రాలు థియేటర్లతో సందడి చేశాయి. అయితే ‘విరాట పర్వం’ విడుదల మాత్రం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. ఇప్పుడు ఈ చిత్రం ప్రస్తావన ఎక్కడా వినిపించడం లేదు. ఒకప్పుడు సినిమాకున్న క్రేజ్ కూడా ఇప్పుడు లేదు. ఇప్పటికీ సినిమాకు బిజినెస్ కాలేదని వినికిడి. రానాకు ఉన్న పరిచయాలతో ఇటీవల సోనీ లివ్ ఓటీటీకి డిజిటల్ హక్కులు అమ్మారు. కానీ థియేటర్ రైట్స్, శాటిలైట్ హక్కులు ఇంకా గాల్లోనే ఉన్నాయని వినికిడి. నిర్మాత డి.సురేశ్బాబు థియేటర్ విడుదల చేయడానికి అంతగా ఇష్టపడడం లేదని సమాచారం. సినిమా వెనుక సురేశ్బాబులాంటి నిర్మాత ఉన్నప్పటికీ ఈ చిత్రం ఓ కొలిక్కి రాకపోవడంపై చర్చలు జరుగుతున్నాయి. మరి.. ‘విరాటపర్వం’ చిత్రానికి విముక్తి కలుగుతుందో చూడాలి.