రుద్రం కోటలో ఏం జరిగింది?

ABN , First Publish Date - 2021-12-05T10:28:54+05:30 IST

సీనియర్‌ నటి జయలలిత ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘రుద్రం కోట’. కోన రాము దర్శకుడు. ఈ చిత్రం టైటిల్‌ లోగోని ఇటీవల హైదరాబాద్‌లో మంచు మోహన్‌బాబు ఆవిష్కరించారు...

రుద్రం కోటలో ఏం జరిగింది?

సీనియర్‌ నటి జయలలిత ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘రుద్రం కోట’. కోన రాము దర్శకుడు. ఈ చిత్రం టైటిల్‌ లోగోని ఇటీవల హైదరాబాద్‌లో మంచు మోహన్‌బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ ‘‘జయలలిత చాలా మంచి వ్యక్తి. ఈ సినిమాతో తొలిసారి నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతోంది. ఈ సినిమాలో అంతా కొత్తవారే. ఎంత పెద్ద ప్రయాణమైనా చిన్న అడుగుతోనే మొదలవ్వాలి. నేను కూడా చిన్న సినిమాలతోనే ఎదిగా’’ అన్నారు. ‘‘కథ బాగా నచ్చింది. అందుకే నిర్మాతనయ్యా. ఖమ్మం జిల్లాలోని ఓ ఊరు.. రుద్రం కోట. ఆ ఊరులో ఏం జరిగిందన్నదే ఈ కథ’’ అన్నారు జయలలిత. 


Updated Date - 2021-12-05T10:28:54+05:30 IST