శ్రీవారి ఆశీస్సులతో సినిమాను మొదలుపెడుతున్నాము: గోపీచంద్ మలినేని

ABN , First Publish Date - 2022-01-29T14:27:44+05:30 IST

శ్రీవారి ఆశీస్సులతో బాలయ్య బాబు హీరోగా సినిమాను మొదలుపెడుతున్నామని చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని తెలిపారు. తాజాగా ఆయన తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్ధం కుటుంబ సభ్యులతో కలిసి

శ్రీవారి ఆశీస్సులతో సినిమాను మొదలుపెడుతున్నాము: గోపీచంద్ మలినేని

శ్రీవారి ఆశీస్సులతో బాలయ్య బాబు హీరోగా సినిమాను మొదలుపెడుతున్నామని చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని తెలిపారు. తాజాగా ఆయన తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్ధం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆయన విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా, ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మైత్రి మూవీస్ బ్యానర్‌లో నందమూరి బాలకృష్ణతో ఈ నెలలోనే కొత్త చిత్రాన్ని ప్రారంభిస్తున్నానని...చిత్ర ప్రారంభానికి ముందు శ్రీవారి ఆశీస్సులు పొందానని గోపిచంద్ తెలిపారు. కాగా, ఆయన గత చిత్రం మాస్ మహారాజ రవితేజతో చేసిన 'క్రాక్' భారీ కమర్షియల్ సక్సెస్‌ను సాధించింది.

Updated Date - 2022-01-29T14:27:44+05:30 IST