సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాం

ABN , First Publish Date - 2022-08-17T07:12:47+05:30 IST

నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం ‘కార్తికేయ 2’. ఇటీవలె విడుదలైన ఈ చిత్రం చక్కని ప్రేక్షకాధరణ సొంతం చేసుకుంటూ ముందుకెళుతోంది...

సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాం

నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం ‘కార్తికేయ 2’. ఇటీవలె విడుదలైన ఈ చిత్రం చక్కని ప్రేక్షకాధరణ సొంతం చేసుకుంటూ ముందుకెళుతోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో చిత్రబృందం సక్సెస్‌ మీట్‌ను నిర్వహించింది. నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘కార్తికేయ2’ చిత్రం చాలా బాగుంది. హిందీ బెల్ట్‌లో 700కు పైగా థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా సక్సె్‌సను నేను బాగా ఎంజాయ్‌ చేస్తున్నాను’ అన్నారు. చిత్ర నిర్మాత అభిషేక్‌  అగర్వాల్‌ మాట్లాడుతూ ‘ఈ సక్సెస్‌ నాది కాదు. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌ గారిది. ఈ విజయం ఆయనకు అంకింతం’ అన్నారు. ఈ సినిమాకు ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, మీడియాకు చిత్ర దర్శకుడు చందుమొండేటి ధన్యవాదాలు తెలిపారు. సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అనుపమా పరమేశ్వరన్‌ అన్నారు. ‘కార్తికేయ 2’ను ఇంత పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌ చెప్పేందుకు ముంబై, ఢిల్లీ వెళ్తున్నామని నిఖిల్‌ చెప్పారు. 


బురద జల్లుడు కార్యక్రమాలు మానుకోండి - దిల్‌రాజు

‘డిజిటల్‌ మీడియాలో క్లిక్‌లు, సబ్‌స్కైబర్లను పెంచుకోవడానికి మాపై బురద జల్లే కార్యక్రమం మానుకోండి. నిజానిజాలు తెలుసుకొని వార్తలు రాయండి. లేదంటే మానుకోండి. మీరు పాపులర్‌ అవ్వడానికి మా సినిమా వాళ్లను బలిపశువులను చేయవద్దు’ అని దిల్‌రాజు అన్నారు. ‘కార్తికేయ 2’ విడుదలను అడ్డుకున్నారంటూ తనపై వచ్చిన ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. ఈ చిత్రం సక్సె్‌సమీట్‌లో దిల్‌రాజు మాట్లాడుతూ ‘నిర్మాతల అనుమతితో ‘కార్తికేయ 2’ సక్సెస్‌ మీట్‌ వేదికగా కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పకపోతే నాపైన ఎప్పటికీ ఆ మచ్చ అలా ఉండిపోతుంది. ఈ సినిమా రిలీజ్‌ గురించి నిఖిల్‌ నాతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు. జులై 22న వివేక్‌కి ఫోన్‌ చేసి ఆ డేటు మా ‘థాంక్యూ’ మూవీకి ఇస్తారా అని అడిగాను. వాళ్లు ఒప్పుకొన్నారు. ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు నిర్మాతలం మాట్లాడుకుంటాం. మా మధ్య ఎప్పుడూ మంచి వాతావారణం ఉంటుంది. కానీ దాన్ని బయటకు మరోలా చూపిస్తూ మా మధ్య అపార్థాలు సృష్టిస్తున్నారు. ఇండస్ట్రీలో మాకు యూనిటీ ఉంది. ఏదైనా  సమస్య ఉంటే పరిష్కరించుకుంటాం. ఆగస్టు ఐదో తారీఖు రిలీజ్‌ చేస్తామని అడిగితే అప్పటికే రెండు సినిమాలు ఉన్నాయని, మూడో సినిమా అయితే బాగోదని చెప్పాను. చివరకు 13న రిలీజ్‌ చేద్దామనుకున్నారు. ఈ లోపల ఎవరికి తోచింది వాళ్లు రాస్తున్నారు. ‘సినిమాని దిల్‌రాజు తొక్కేస్తున్నాడు’ అని అంటున్నారు. ఇక్కడ ఉండేవాళ్లు ఎవరూ అలా చేయరు. రాసేవాళ్లకి, చదివేవాళ్లకి, వినేవాళ్లకి ఉండాల్సిన మినిమం కామన్‌సెన్స్‌ అది. ఎవరి సినిమా ఆడినా అందరం ఆనందపడతాం. ఇంకో సినిమా తీయడానికి ఆ విజయం మాకు ఊపిరి పోస్తుంది. గతంలో కూడా నాపై ఇలాంటి తప్పుడు వార్తలు రాశారు. నేను వివాదాలు కోరుకోను. కానీ మీడియా ఈ రాద్ధాంతం మొదలుపెట్టింది. ఎవరికి తోచింది వాళ్లు రాస్తున్నారు. వాస్తవాలు తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ‘మీ గురించి ఇలా వినిపిస్తోంది, ఏమంటారు’ అని నన్ను అడిగి కౌంటర్‌ చేయాలి. దిల్‌రాజు పేరు ద్వారా మీరు పాపులర్‌ అవ్వాలనుకుంటున్నారు. నేను తప్పు చేస్తే మీడియా ముందు క్షమాపణలు అడుగుతాను. సినిమా కోసం ప్రాణం ఇస్తాను. బ్రతికున్నంత వరకూ ఎవరి సినిమా అయినా పాడు చేయను. ఏదైనా తెలుసుకొని రాయండి’ అని మీడియా ప్రతినిధులను కోరారు. 

Updated Date - 2022-08-17T07:12:47+05:30 IST