Laathi : షూటింగ్ పూర్తి
ABN , First Publish Date - 2022-07-15T22:29:54+05:30 IST
యాక్షన్ హీరో విశాల్ (Vishal) కధానాయకుడిగా, కొత్త దర్శకుడు ఎ.వినోద్ కుమార్ (A Vinodkumar) తెరకెక్కి్స్తున్న పాన్ ఇండియా మూవీ 'లాఠీ' (Laathi). హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా ప్రొడక్షన్స్ బ్యానర్పై రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

యాక్షన్ హీరో విశాల్ (Vishal) కధానాయకుడిగా, కొత్త దర్శకుడు ఎ.వినోద్ కుమార్ (A Vinodkumar) తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ 'లాఠీ' (Laathi). హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా ప్రొడక్షన్స్ బ్యానర్పై రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విశాల్ సరసన సునైనా (Sunaina) కథానాయికగా నటిస్తోంది. తాజాగా జరిగిన షూటింగ్ లో విశాల్కు గాయాలు కావడం, ఫైట్ సీక్వెన్స్ల కోసం భారీ వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా ఈ చిత్రం విడుదలను ఆగస్టు 12 నుండి సెప్టెంబర్ 15కి వాయిదా వేశారు. సెప్టెంబర్ 15న ‘లాఠీ’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయినట్టు ట్విట్టర్ వేదికగా తెలిపారు మేకర్స్. ఈ సందర్భంగా ‘లాఠీ’ చిత్ర బృందం దిగిన ఫోటోను షేర్ చేశారు.
తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి తమిళంలో ‘లత్తి’ (Laththi) అనే టైటిల్ పెట్టగా.. మిగిలిన భాషల్లో ‘లాఠీ’ టైటిల్ ను ఖాయం చేశారు. ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ని దర్శకుడు వినోద్ కుమార్ సరికొత్త కథాంశంతో తెరకెక్కించారు. సమాజంలో మార్పు తెచ్చే శక్తి లాఠీకి వుంది. విశాల్ ఆ 'లాఠీ' తో సమాజంలో ఎలాంటి మార్పులకు నాంది పలికారో అన్నది ఆసక్తికరం. ఇందులో విశాల్ ఫుల్ లెంత్ యాక్షన్ కి ప్రాధాన్యత వున్న పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ద్వితీయార్ధంలో ఉండే 45నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. దిలీప్ సుబ్బరాయన్, మరో స్టంట్ మాస్టర్ గా పనిచేశారు. బాలసుబ్రమణ్యన్ ఛాయాగ్రహకుడిగా, సామ్ సిఎస్ సంగీత దర్శకుడిగా, పొన్ పార్థిబన్ రచయితగా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. మరి ‘లాఠీ’ చిత్రం విశాల్ కు ఏ స్థాయిలో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.