విక్రమ్‌ - ధృవ్‌.. ‘మహాన్’ టాకేంటి?

ABN , First Publish Date - 2022-02-14T00:33:13+05:30 IST

కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహించిన ‘మహాన్‌’ చిత్రం తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో విడుదలై సందడి చేస్తోంది. హీరో విక్రమ్‌, ఆయన తనయుడు ధృవ్‌ తొలిసారి ఒకే సినిమాలో కనిపించి అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఈ చిత్రం తొలి భాగంపై

విక్రమ్‌ - ధృవ్‌.. ‘మహాన్’ టాకేంటి?

కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహించిన ‘మహాన్‌’ చిత్రం తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో విడుదలై సందడి చేస్తోంది. హీరో విక్రమ్‌, ఆయన తనయుడు ధృవ్‌ తొలిసారి ఒకే సినిమాలో కనిపించి అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఈ చిత్ర తొలి భాగం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకున్నా రెండో భాగం అలరిస్తోంది. ముఖ్యంగా ధృవ్‌ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో వేగం, ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించింది. మద్యం మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కూడా తండ్రీకొడుకులుగా విక్రమ్‌ - ధృవ్‌ కనిపించారు. సీనియర్‌ హీరోయిన్‌ సిమ్రాన్‌ హీరో విక్రమ్‌కు భార్యగా నటించింది. 


ఇదిలావుండగా ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా విక్రమ్‌ అభిమానులు తమిళ నాడు రాష్ట్ర వ్యాప్తంగా బైక్‌ ర్యాలీలు నిర్వహిస్తూ, ‘మహాన్‌’కు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ 7 స్ర్కీన్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై నిర్మాత ఎస్‌ఎస్. లలిత్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. కాగా, హీరో విక్రమ్‌ తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టిసారించారు. ఎనిమిదేళ్ల క్రితం దర్శకుడు పా.రంజిత్‌ చెప్పిన కథతో కొత్త చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ ప్రాజెక్టు త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది. విక్రమ్‌ నటించిన ‘కోబ్రా’, ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 

Updated Date - 2022-02-14T00:33:13+05:30 IST