Vijay Deverakonda: ఇంద్రగంటితో సినిమా..!
ABN , First Publish Date - 2022-09-11T01:30:01+05:30 IST
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ‘లైగర్’ (Liger) తో భారీ పరాజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న సినిమా నిరాశ పరచడంతో తర్వాతి కథల ఎంపికపై
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ‘లైగర్’ (Liger) తో భారీ పరాజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న సినిమా నిరాశ పరచడంతో తర్వాతి కథల ఎంపికపై దృష్టి సారించాడు. ప్రస్తుతం ‘రౌడీ’ హీరో ఖుషి (Kushi) సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. క్రిస్మస్ కానుకగా ఈ మూవీ థియేటర్స్లోకి రానుంది. తాజాగా విజయ్కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అతడు ‘ఖుషి’ తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ (Indraganti Mohan Krishna) తో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఇంద్రగంటి లైన్ వినిపించగా విజయ్ ఆసక్తి కనబరిచినట్టు సమాచారం.
‘లైగర్’ విడుదలకు ముందు రొమాంటిక్ కథలు చేయనని విజయ్ చెప్పాడు. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలవడంతో ప్రేమ కథా చిత్రాల వైపు తిరిగి మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఇంద్రగంటి మోహన్ కృష్ణ రొమాంటిక్, లవ్ ఎంటర్టైనర్స్ను అద్భుతంగా డీల్ చేస్తాడు. ప్రస్తుతం అటువంటి కథనే విజయ్ కోసం సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. విజయ్ ‘ఖుషి’ తర్వాత ఇంద్రగంటితో ప్రాజెక్టును పట్టాలెక్కించే అవకాశం ఉంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తాడని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ (Aa Ammayi Gurinchi Meeku Cheppali) కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 16న విడుదల కానుంది. ఈ మూవీలో సుధీర్ బాబు, కృతి శెట్టి హీరో, హీరోయిన్స్గా నటించారు.