సేమ్ బ్యానర్‌లో విజయ్‌ ఆంటోనీ హీరోగా మరో చిత్రం

ABN , First Publish Date - 2021-11-28T03:22:36+05:30 IST

‘తమిళపడం’ చిత్రం ఫేం సీఎస్. అముదన్‌ దర్శకత్వం వహించే ఈ చిత్ర షూటింగ్‌ చెన్నై నగరంలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఈ యేడాది ‘కోడియిల్‌ ఒరువన్‌’ చిత్రం ద్వారా విజయ్‌ ఆంటోనీ సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. కరోనా కష్టకాలంలో..

సేమ్ బ్యానర్‌లో విజయ్‌ ఆంటోనీ హీరోగా మరో చిత్రం

ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్స్‌ నిర్మాణంలో విజయ్‌ ఆంటోనీ హీరోగా కొత్త చిత్రం తెరకెక్కనుంది. ‘తమిళపడం’ చిత్రం ఫేం సీఎస్. అముదన్‌ దర్శకత్వం వహించే ఈ చిత్ర షూటింగ్‌ చెన్నై నగరంలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఈ యేడాది ‘కోడియిల్‌ ఒరువన్‌’ చిత్రం ద్వారా విజయ్‌ ఆంటోనీ సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. కరోనా కష్టకాలంలో ఈ చిత్రం నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో అనేక మంది నిర్మాతలు ఆయనతో చిత్రాలు నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం షూటింగ్‌ పూర్తి చేస్తున్నారు. దీంతో విజయ్‌ ఆంటోనీ వరుస ప్రాజెక్టులకు కమిట్‌ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ‘తమిళపడం’ అనే చిత్రం ద్వారా సరికొత్త జానర్‌లో సినిమా తీసి ఇండస్ట్రీ మొత్తం తనవైపు చూసేలా చేసిన సీఎస్. అముదన్‌ ఇపుడు సరికొత్త కథతో విజయ్‌ ఆంటోనీ హీరోగా మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. 


ఇన్ఫినిటీ వెంచర్స్‌ నిర్మాణ సంస్థ తరపున నిర్మాతలు కమల్‌ బోరా, జి.ధనుంజయన్‌, బి.ప్రదీప్‌, పంకజ్‌ బోరా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభ పూజా కార్యక్రమంలో పలువురు సినీ సెలెబ్రిటీలు పాల్గొన్నారు. కాగా, విజయ్‌ ఆంటోనీ నటించిన ‘కోడియిల్‌ ఒరువన్‌’ చిత్రం తర్వాత ‘కొలై’, మళై పిడిక్కాద మణిదన్‌’ వంటి చిత్రాలు విడులకు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు చిత్రాలను కూడా ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్స్‌ బ్యానరుపైనే నిర్మించడం గమనార్హం.

Updated Date - 2021-11-28T03:22:36+05:30 IST