Victim: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
ABN , First Publish Date - 2022-08-03T18:58:04+05:30 IST
కోలీవుడ్కు చెందిన నలుగురు దర్శకులు ఒకే కంటెంట్ థీమ్తో నాలుగు కోణాల్లో నిర్మించిన చిత్రమే ‘విక్టిమ్’. మొత్తం నాలుగు సంకలనాలతో దీనిని రూపొందించారు. దర్శకుడు పా.రంజిత్ (Pa.Ranjith)
కోలీవుడ్కు చెందిన నలుగురు దర్శకులు ఒకే కంటెంట్ థీమ్తో నాలుగు కోణాల్లో నిర్మించిన చిత్రమే ‘విక్టిమ్’. మొత్తం నాలుగు సంకలనాలతో దీనిని రూపొందించారు. దర్శకుడు పా.రంజిత్ (Pa.Ranjith) ‘దమ్మమ్’, చింబుదేవన్ ‘మొట్టైమాడి సిద్ధర్’, వెంకట్ ప్రభు (Venkat Prabhu) ‘కన్ఫెషన్’, ఎం.రాజేష్ ‘మిరాజ్’ పేర్లతో ఒకే కంటెంట్ను విభిన్న కోణాలలో కోణాల్లో తెరకెక్కించి, దీనికి ‘విక్టిమ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. బ్లాక్ టిక్కెట్ ప్రొడక్షన్స్, యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్తగా నిర్మించాయి. ఈ నెల 5 నుంచి సోనీ లైవ్లో స్ట్రీమింగ్ కానుంది.
ఇందులో అమలాపాల్ (Amala Paul), ప్రియాభవానీ శంకర్ (Priya Bhavni Shankar), గురు సోమసుందరం, లిజీ అంటాన్, ప్రసన్న, నటరాజ్ సుబ్రమణియన్, తబి రామయ్య, కలైయరసన్ హరికృష్ణన్, నాజర్ తదితరులు నటించారు. ఈ ‘విక్టిమ్’ గురించి చింబుదేవన్, వెంకట్ ప్రభు, పా.రంజిత్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఈ చిత్రాన్ని లాక్డౌన్ సమయంలో వచ్చిన ఆలోచనతో మేమంతా మాట్లాడుకుని ఈ అంథాలజీ ప్రాజెక్టును రూపొందించాం. దీనికి మూల కథ ఒక్కటే.
కానీ, మా నలుగురి ఆలోచనలకు అనుగుణంగా నాలుగు కోణాల్లో, మేం చెప్పిన తీరు వేరుగా ఉంటుంది. భారీ బడ్జెట్, మంచి కంటెంట్ చిత్రాలను చూసేందుకు మాత్రమే ప్రేక్షకలు థియేటర్కు వస్తున్నారు. అలాంటి చిత్రాలే సక్సె్సను సాధిస్తున్నాయి. టెక్నాలజీకి అనుగుణంగా మారకపోతే ఇక్కడ నిలబడటం కష్టం. మనస్సులో ఉన్న భావాలను సెన్సార్ అడ్డంకి లేకుండానే ధైర్యంగా చెప్పే ప్రసారమాధ్యమంగా ఓటీటీ ఫ్లాట్ఫాం మారింది’.. అని వివరించారు.