తమ పెళ్లి ఫొటోలను భారీ ధరకు అమ్మేసిన విక్కీ కౌశల్, Katrina Kaif ..?
ABN , First Publish Date - 2021-12-03T01:07:51+05:30 IST
విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి బాలీవుడ్లో ట్రెండింగ్ టాపిక్గా నిలిచింది. ప్రతిరోజు వీరి పెళ్లికి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది
విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి బాలీవుడ్లో ట్రెండింగ్ టాపిక్గా నిలిచింది. ప్రతిరోజు వీరి పెళ్లికి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. బీ టౌన్లో వీరి పెళ్లికి సంబంధించి ఒక వార్త హల్చల్ చేస్తుంది. తమ పెళ్లి ఫొటోలను కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ భారీ ధరకు ఇంటర్నేషనల్ మ్యాగజైన్కి అమ్మేసినట్టు బీ టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పాపులర్ బాలీవుడ్ జంట అయిన ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ తమ పెళ్లి ఫొటోలను గతంలో ఈ విధంగానే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్కి అమ్మేశారు.
ఈ లవ్ బర్డ్స్ డిసెంబర్ 2 లేదా 3న ముంబైలో కోర్ట్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. వీరి వివాహం డిసెంబర్ 9న రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ ఆఫ్ ఫోర్ట్లో జరగబోతోందని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ కావొద్దని ఈ జంట భావిస్తోంది. అందువల్ల అతిథులు ఎవరికి కూడా సెల్ ఫోన్లను తీసుకురావడానికి పర్మిషన్ లేదు. అందుకు కారణమేంటని ఆరా తీస్తే ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఇండియన్ ఎడిషన్కు ఈ ఫొటోల హక్కులను అమ్మేసినట్టు బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. కత్రినా సహాయక బృందం కూడా ఈ విషయం వాస్తమేనని చెప్పడం గమనార్హం. ఈ ఫొటోలను అమ్మడం ద్వారా వీరు భారీ మొత్తంలో అర్జించనున్నారని ఆమె సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. అందువల్ల పెళ్లి జరిగిన కొంతకాలం వరకు ఫొటోలు బయటికి రావు. వాటిని చూడాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
వోగ్ మ్యాగజైన్ ఫ్యాషన్ డైరెక్టర్ అయిన అనైతా ష్రాఫ్ అదజానియా కత్రినా కైఫ్కు సన్నిహిత మిత్రురాలు. కత్రినా పెళ్లి ఫొటోలను తమ మ్యాగజైన్ లో పబ్లిష్ చేయాలని ఆమె అనుకుంది. ఫొటోల హక్కులు దక్కించుకోవాలని చూసింది. కానీ, ఆసక్తికరంగా ఇంటర్నేషనల్ మ్యాగజైన్కు ఆ హక్కులను అమ్మేయడం గమనార్హం.