‘నాట్యం’ టీమ్‌కు ఉప రాష్ట్రపతి అభినందనలు

ABN , First Publish Date - 2021-10-23T00:28:00+05:30 IST

క్లాసికల్ డాన్సర్ సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశ్రింకళ ఫిల్మ్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రం నేడు(అక్టోబర్ 22) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుండి

‘నాట్యం’ టీమ్‌కు ఉప రాష్ట్రపతి అభినందనలు

క్లాసికల్ డాన్సర్ సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశ్రింకళ ఫిల్మ్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రం నేడు(అక్టోబర్ 22) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుండి మంచి స్పందనను అందుకుంటున్న ఈ చిత్రాన్ని తాజాగా వీక్షించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ వేదికగా అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ మేరకు నాట్యం సినిమాపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు.


‘నాట్యకళ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ కూచిపూడి నృత్యకళాకారిణి శ్రీమతి సంధ్యారాజు ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘నాట్యం’ చక్కని చిత్రం. భారతీయ సంస్కృతిలో కళలకు ఇచ్చిన ప్రాధాన్యతను కళ్ళకు కడుతూ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రేవంత్ కోరుకొండ, ఇతర నటీనటులకు అభినందనలు’ అని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోషల్ మీడియా ఖాతాలో ట్వీట్ చేశారు. 



Updated Date - 2021-10-23T00:28:00+05:30 IST