'రామారావు ఆన్ డ్యూటీ'తో వేణు రీఎంట్రీ

ABN , First Publish Date - 2021-07-29T17:45:13+05:30 IST

మాస్ మాహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ మూవీతో సీనియ నటుడు వేణు తొట్టెంపూడి రీఎంట్రీ ఇస్తున్నాడు. డెబ్యూ డైరెక్టర్ శరత్ మండవ తెరకెక్కిస్తున్న ఇందులో మజిలీ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్, మలయాళ నటి రాజేష్ విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

'రామారావు ఆన్ డ్యూటీ'తో వేణు రీఎంట్రీ

మాస్ మాహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ మూవీతో సీనియ నటుడు వేణు తొట్టెంపూడి రీఎంట్రీ ఇస్తున్నాడు. డెబ్యూ డైరెక్టర్ శరత్ మండవ తెరకెక్కిస్తున్న ఇందులో మజిలీ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్, మలయాళ నటి రాజేష్ విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా 'వెల్కమ్ ఎ బోర్డ్ వేణు' అంటూ ఓ పోస్టర్‌ను వదిలారు. 


కాగా 1999లో వచ్చిన 'స్వయంవరం' సినిమాతో హీరోగా తెలుగు తెరకి పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నాడు. ఆ తరువాత 26 సినిమాల్లో నటించగా, సుమారు 17 సినిమాలు హిట్ అయ్యాయి. హీరోగా వంశీ దర్శకత్వంలో వచ్చిన 'గోపి గోపిక గోదావరి' సినిమా తరువాత, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దమ్ము' సినిమాలో ఓ క్యారెక్టర్ చేశాడు. దాని తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. మళ్లీ ఇంత కాలం తరువాత 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు వేణు తొట్టెంపూడి. 



Updated Date - 2021-07-29T17:45:13+05:30 IST