Venu Thottempudi : మరో క్రేజీ ఆఫర్ అందుకున్నాడా?

ABN , First Publish Date - 2022-08-08T14:45:42+05:30 IST

టాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోగా బాగా రాణించారు వేణు తొట్టెంపూడి (Venu Thottempudi). ముఖ్యంగా ప్రేమకథా చిత్రాలకు, కుటుంబ కథా చిత్రాలకు.. దర్శక నిర్మాతలకు మంచి ఆప్షన్ గా ఉండేవారు. ‘స్వయంవరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళితే లాంటి సినిమాలన్నీ వేణుకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

Venu Thottempudi : మరో క్రేజీ ఆఫర్ అందుకున్నాడా?

టాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోగా బాగా రాణించారు వేణు తొట్టెంపూడి (Venu Thottempudi). ముఖ్యంగా ప్రేమకథా చిత్రాలకు, కుటుంబ కథా చిత్రాలకు.. దర్శక నిర్మాతలకు మంచి ఆప్షన్ గా ఉండేవారు. ‘స్వయంవరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళితే లాంటి సినిమాలన్నీ వేణుకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ‘రామాచారి వీడో పెద్గగూఢ చారి’ (Ramachari Veedo Pedda Goodhachari) వేణు ఆఖరుగా తెరపై కనిపించిన చిత్రం. దీని తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నారు వేణు. రీసెంట్ గా రవితేజ (Raviteja) ‘రామారావు ఆన్‌డ్యూటీ’ (Ramarao Onduty) చిత్రంలో పోలీస్ పాత్ర చేసినప్పటికీ అతడి రీఎంట్రీ ప్రయత్నం వృధా అయింది. అయినప్పటికీ.. వేణును మరో క్రేజీ ఆఫర్ వరించినట్టు సమాచారం అందుతోంది.


సూపర్ స్టార్ మహేశ్ బాబు (Maheshbabu) హీరోగా త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలోని సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్ళనున్న సంగతి తెలిసిందే. SSMB 28 గా పిలుచుకుంటున్న ఈ సినిమాలో పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా నటించబోతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను రాధాకృష్ణ (Radhakrishna) నిర్మించబోతున్నారు. ఈ సినిమాకి ‘అర్జునుడు’ (Arjunudu) అనే టైటిల్ ను ఖాయం చేస్తున్నట్టు ఇదివరకు వార్తలొచ్చాయి. ఇందులో వేణు తొట్టెంపూడికి త్రివిక్రమ్ కీలక పాత్రను ఆఫర్ చేశారట. నిజానికి హీరోగా వేణు తొలి చిత్రం ‘స్వయంవరం’ (Swayamvaram) కు త్రివిక్రమ్ కథ, మాటలు అందించారు. అందులోని త్రివిక్రమ్ డైలాగ్స్ ఓ రేంజ్‌లో పేలాయి. ఆ తర్వాత వేణు నటించిన ‘చిరునవ్వుతో’ (Chirunavvutho) చిత్రానికీ త్రివిక్రమ్ కలం కదిలించారు. ఈ సినిమా కూడా అప్పట్లో సూపర్ హిట్టయింది. ఇప్పుడు ఏకంగా త్రివిక్రమ్ డైరెక్టోరియల్ మూవీలోనే వేణు నటించనుండడం విశేషంగా మారింది. 


అతడు (Athadu), ఖలేజా (Khaleja) చిత్రాల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న ఈ మూడో చిత్రానికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘అల వైకుంఠపురము’ లో చిత్రాలతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న త్రివిక్రమ్ ఈ సారి కూడా మహేశ్ ను యాక్షన్ హీరోగా ప్రెజెంట్ చేయబోతున్నట్టు సమాచారం. స్ర్కిప్ట్ వర్క్ పూర్తి చేసి.. చిత్రాన్ని త్వరలోనే పట్టాలెక్కించే పనిలో ఉన్నారు త్రివిక్రమ్. మరి ఈ సినిమాతో అయినా వేణు.. టాలీవుడ్ లో నటుడిగా బిజీ అవుతారేమో చూడాలి. 

Updated Date - 2022-08-08T14:45:42+05:30 IST