బాలీవుడ్‌లో వెంకీ మూవీ..!

ABN , First Publish Date - 2021-12-09T13:12:58+05:30 IST

బాలీవుడ్‌లో వెక్టరీ వెంకటేశ్ ఓ మూవీ చేయబోతున్నారని లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వచ్చి చక్కర్లు కొడుతోంది. ఇటీవల 'నారప్ప', 'దృశ్యం 2' చిత్రాలతో వచ్చి వరుసగా రెండు సూపర్ హిట్స్ అందుకున్న

బాలీవుడ్‌లో వెంకీ మూవీ..!

బాలీవుడ్‌లో వెక్టరీ వెంకటేశ్ ఓ మూవీ చేయబోతున్నారని లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వచ్చి చక్కర్లు కొడుతోంది. ఇటీవల 'నారప్ప', 'దృశ్యం 2' చిత్రాలతో వచ్చి వరుసగా రెండు సూపర్ హిట్స్ అందుకున్న వెంకటేశ్ 'ఎఫ్ 2' మూవీ సీక్వెల్ 'ఎఫ్ 3'ని రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. వరుణ్ తేజ్ మరోగా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. దీని తర్వాత వెంకీ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ హిందీలోనని తెలిస్తోంది. ఇటీవల సల్మాన్ కూడా వెంకటేశ్, చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్టు తెలిపారు. దాంతో అందరూ వెంకీ నటిస్తున్న తెలుగు మూవీలో సల్మాన్ గెస్ట్ రోల్ చేస్తున్నారని భావించారు. కానీ, తాజా సమాచారం ప్రకారం సల్మాన్ నటిస్తున్న హిందీ మూవీలో వెంకటేశ్ నటించబోతున్నారట. ఈ మూవీకి ఫర్హాన్ సమ్జీ దర్శకత్వం  వహించబోతున్నారు. సల్మాన్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించబోతుంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభిస్తారట. దాదాపు 25 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు వెంకటేశ్. ప్రస్తుతం వెంకీ రానా కలిసి ఓ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తున్నారు.

Updated Date - 2021-12-09T13:12:58+05:30 IST