వేగేశ్న సతీష్ శైలిలో 'కథలు(మీవి మావి)' వెబ్ సిరీస్..

ABN , First Publish Date - 2022-03-20T18:33:02+05:30 IST

'శతమానం భవతి', 'శ్రీనివాస కళ్యాణం', 'ఎంతమంచి వాడవురా'.. లాంటి కుటుంబ కథా చిత్రాలతో దర్శకుడిగా మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. వేగేశ్న సతీష్. ప్రస్తుతం ఆయన శైలిలో 'కథలు(మీవి మావి)' అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు.

వేగేశ్న సతీష్ శైలిలో 'కథలు(మీవి మావి)' వెబ్ సిరీస్..

'శతమానం భవతి', 'శ్రీనివాస కళ్యాణం', 'ఎంతమంచి వాడవురా'.. లాంటి కుటుంబ కథా చిత్రాలతో దర్శకుడిగా మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. వేగేశ్న సతీష్. ప్రస్తుతం ఆయన శైలిలో 'కథలు(మీవి మావి)' అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్‌లో వెబ్ సిరీస్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే సీనియర్ దర్శకులు, కొత్త దర్శకులు ఈ వెబ్ సిరీస్‌లను చేస్తూ ఓటీటీ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు వేగేశ్న సతీష్ కూడా డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం 'కోతి కొమ్మచ్చి', 'శ్రీ శ్రీ రాజా వారు' సినిమాలు చేస్తున్న ఆయన పల్లెటూరి కథలతో ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు.


ఇది పూర్తిగా వేగేశ్న సతీష్ శైలిలో సాగే పల్లెటూరి కథలతో తెరకెక్కబోతున్న ఆంతాలజీతో కూడిన వెబ్ సిరీస్. అందుకే దీనికి 'కథలు(మీవి మావి)' అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేశారు. ఇప్పటికే మూడు కథలకు సంబంధించి షూటింగ్‌ను కూడా పూర్తి చేశారు. త్వరలోనే మిగిలిన కథలకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేసి ప్రముఖ ఓటీటీ సంస్థ ద్వారా విడుదల చేయనున్నారు. ఇక ఈ సిరీస్ కోసం కొందరు ప్రముఖ నటీ నటులు అలాగే సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. త్వరలోనే మిగతా వివరాలను వెల్లడించనున్నారు. 

Updated Date - 2022-03-20T18:33:02+05:30 IST