‘దంగల్’ దర్శకుడితో వరుణ్ ధావన్, కియారా అడ్వాణీ

ABN , First Publish Date - 2022-01-17T02:06:24+05:30 IST

వరుణ్ ధావన్, కియారా అడ్వాణీ హీరో, హీరోయిన్లుగా రూపొందిన సినిమా ‘‘జుగ్ జుగ్ జీయో’’. ఆ మూవీ షూటింగ్ ముగిసింది

‘దంగల్’ దర్శకుడితో వరుణ్ ధావన్, కియారా అడ్వాణీ

వరుణ్ ధావన్, కియారా అడ్వాణీ హీరో, హీరోయిన్లుగా రూపొందిన సినిమా ‘‘జుగ్ జుగ్ జీయో’’. ఆ మూవీ షూటింగ్ ముగిసింది. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ చిత్రంలో అనిల్ కపూర్, నీతు కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ్ మెహతా దర్శకత్వం వహిస్తున్నారు. ఆ చిత్రం విడుదల కాకముందే వరుణ్, కియారా మరో చిత్రంలో హీరో, హీరోయిన్లుగా ఎంపికయినట్టు తెలుస్తోంది. ఒక కొత్త సినిమాలో వీరిద్దరు కలిసి నటించబోతున్నారని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. 


ఈ జంట నటించబోయే సినిమాకు నితీశ్ తివారీ దర్శకత్వం వహించబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో నితీశ్ తివారీ ‘‘దంగల్’’, ‘‘ఛిఛోరే’’ వంటి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈ ప్రాజెక్టు లవ్ స్టోరీగా తెరకెక్కబోతున్నట్టు  బీ టౌన్ మీడియా తెలుపుతోంది. మొదట్లో ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ని హీరోయిన్‌గా తీసుకోవాలని నితీశ్ తివారీ భావించరట. కానీ, కియారా అడ్వాణీని హీరోయిన్ పాత్రకు తీసుకున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ మూవీని సాజిద్ నడియాడ్ వాలా నిర్మించబోతున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య భాగంలో సినిమా షూటింగ్‌‌ను ప్రారంభించే అవకాశముంది.

Updated Date - 2022-01-17T02:06:24+05:30 IST