‘వలీమై’: వైరల్ అవుతోన్న 10,000 చదరపు అడుగుల అజిత్ పోస్టర్

ABN , First Publish Date - 2022-03-22T01:23:02+05:30 IST

తమిళ స్టార్‌ హీరో అజిత్‌ నటించిన ‘వలీమై’ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ చిత్రం జీ5 ఓటీటీ ప్లాట్‌ఫాంపై ఈనెల 25 నుంచి ప్రదర్శితం కానుంది. దీనికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను జీ5 వినూత్నంగా..

‘వలీమై’: వైరల్ అవుతోన్న 10,000 చదరపు అడుగుల అజిత్ పోస్టర్

తమిళ స్టార్‌ హీరో అజిత్‌ నటించిన ‘వలీమై’ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ చిత్రం జీ5 ఓటీటీ ప్లాట్‌ఫాంపై ఈనెల 25 నుంచి ప్రదర్శితం కానుంది. దీనికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను జీ5 వినూత్నంగా నిర్వహిస్తుంది. ఎలా అంటే.. జీ5 సంస్థ చెన్నైలోని వైయంసీఏ సర్కిల్‌లో అజిత్‌ కుమార్‌‌కి సంబంధించిన 10,000 అడుగుల పొడవైన అతిపెద్ద పోస్టర్‌ను ఏర్పాటు చేసింది. భారతదేశంలో ఏ ఓటీటీ సంస్థ ఇటువంటి అతి పెద్ద పోస్టర్‌ను ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ టాక్‌ ఆఫ్‌ టౌన్‌ అవుతోంది. అలాగే సోషల్‌ మీడియాలో కూడా ఈ విషయం విపరీతంగా వైరల్‌ అవుతూ అజిత్‌ ఇమేజ్‌ను మరింతగా పెంచుతోంది. 


‘‘అందరూ ఈ పోస్టర్‌ను చూసి అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అజిత్‌ అభిమానులతో పాటు, భారతీయ ప్రేక్షకుల కోసం ఈనెల 25 నుంచి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చిత్రం ‘వలీమై’ మా జీ5 ఓటీటీలో ప్రదర్శిస్తుండటం చాలా గర్వంగా ఉంది’’ అని సంస్థ యాజమాన్యం ప్రకటించింది. 2022లో ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా ‘వలీమై’. ఇందులో అజిత్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ అర్జున్‌ పాత్రలో నటించగా, హుమా ఖురైషీ ముఖ్య పాత్రలో నటించారు. ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్స్‌తో కూడిన క్లీన్ కాప్ డ్రామాగా అడ్వంచర్ అంశాలతో ఈ చిత్రం రూపొందింది. నటుడు అజిత్ కుమార్ యొక్క మాగ్నెటిక్ స్క్రీన్ వ్యక్తిత్వం మరియు కార్తికేయ యొక్క సాతాను అవతార్ మధ్య జరిగిన ముఖాముఖి సన్నివేశాలు ప్రేక్షకుల స్పందనతో సినిమా హాళ్లు సైతం దద్దరిల్లిపోయాయి. హెచ్.వినోద్ రచనా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌‌తో కలిసి బేవ్యూ ప్రాజెక్ట్ ఎల్‌ఎల్‌పికి చెందిన బోనీ కపూర్ నిర్మించారు. 



Updated Date - 2022-03-22T01:23:02+05:30 IST