మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా 2022 విన్నర్, రన్నర్స్ వీరే!
ABN , First Publish Date - 2022-03-21T23:40:51+05:30 IST
రాజస్థాన్కి చెందిన వైష్ణవి శర్మ మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా 2022 టైటిల్ గెలుచుకోగా.. మహారాష్ట్రకి చెందిన మిస్ మెహరమీట్ కౌర్ మరియు తమిళనాడుకి చెందిన మిస్ అభినయ.. మణప్పురం మరియు డీక్యూ మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా 2022

రాజస్థాన్కి చెందిన వైష్ణవి శర్మ మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా 2022 టైటిల్ గెలుచుకోగా.. మహారాష్ట్రకి చెందిన మిస్ మెహరమీట్ కౌర్ మరియు తమిళనాడుకి చెందిన మిస్ అభినయ.. మణప్పురం మరియు డీక్యూ మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా 2022 పోటీలో రన్నరప్స్గా నిలిచారు. డాక్టర్ అజిత్ రవి మరియు పెగాసుస్ గ్లోబల్ ఎండి జిబితా మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా 2022ని గౌరవించారు. మొదటి మరియు రెండవ విజేతలను మణప్పురం ఎండి అండ్ సిఈఓ వి. పి. నందకుమార్ గౌరవించారు. ఆదివారం రాత్రి కోచిలోని సాజ్ ఎర్త్ రిసార్ట్స్ కన్వెన్షన్ సెంటర్లో మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా 2022 ఫైనల్స్ ముగిశాయి.
ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మణప్పురం మరియు పెగాసుస్ సంస్థల ప్రతినిధులు ఈ పోటీల వివరాలు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల నుంచీ పెద్ద సంఖ్యలో యువతులు దరఖాస్తు చేసుకున్న ఈ పోటీలో పలు రాష్ట్రాలకి చెందిన 20మంది అందమైన యువతులు టైటిల్ పోరుకు ఎంపికయ్యారు. హోరాహోరీగా తలపడ్డారు. తుది పోరులో రాజస్థాన్కి చెందిన వైష్ణవి శర్మ మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా 2022గా ఎంపికయ్యారని వారు తెలిపారు.
