మెగా కోడలు మరోసారి ఫిదా చేసేసింది

ABN , First Publish Date - 2021-09-26T03:26:47+05:30 IST

మెగా కోడలు ఉపాసన తన ఇన్‌స్టాగ్రమ్ వేదికగా మెగాభిమానుల్ని ఫిదా చేసింది. సోషల్ మీడియాలో హెల్త్ టిప్స్‌తో పాటు మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను తెలియజేస్తూ.. మెగాభిమానులు ప్రత్యేకంగా అభిమానించే

మెగా కోడలు మరోసారి ఫిదా చేసేసింది

మెగా కోడలు ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా మెగాభిమానుల్ని ఫిదా చేసింది. సోషల్ మీడియాలో హెల్త్ టిప్స్‌తో పాటు మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను తెలియజేస్తూ.. మెగాభిమానులు ప్రత్యేకంగా అభిమానించే స్థాయికి ఆమె చేరుకుంది. ముఖ్యంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గురించి అనేక విషయాలను ఆమె సోషల్ మీడియాలో తెలియజేస్తుంటారు. అయితే ఇప్పుడు మాత్రం ఓ ప్రత్యేక పిక్‌ని పోస్ట్ చేసి.. తనకి వారెంత ఇంపార్టెంటో తెలియజేసింది ఉపాసన. ఈ పిక్‌లో భార్య సురేఖతో మెగాస్టార్ చిరంజీవి, ఉపాసన తల్లిదండ్రులు శోభన, అనీల్ కామినేనిలు కలిసి ఉన్నారు. ‘నాకు అత్యంత విలువైన ఫొటో ఇది’ అంటూ ఉపాసన చేసిన పోస్ట్ చూసి మెగాభిమానులు ఖుషి అవుతున్నారు. అత్తమామలని కూడా తన తల్లిదండ్రులలా భావిస్తున్న ఉపాసనపై మెగాభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.





Updated Date - 2021-09-26T03:26:47+05:30 IST