ARYAN KHAN కేస్ : తొలిసారిగా ఇద్దరు నిందితులకి BAIL

ABN , First Publish Date - 2021-10-27T01:28:08+05:30 IST

షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ నిందితుడుగా ఉన్న క్రుయిజ్ డ్రగ్స్ కేసులో తొలిసారిగా ఇద్దరికి ఊరట లభించింది. ముంబైలోని ప్రత్యేక ఎన్డీపీఎస్ కోర్టు మంగళవారం మనీశ్ రాజ్గరియా, అవిన్ సాహూకు బెయిల్ మంజూరు చేసింది...

ARYAN KHAN కేస్ : తొలిసారిగా ఇద్దరు నిందితులకి BAIL

షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ నిందితుడుగా ఉన్న క్రుయిజ్ డ్రగ్స్ కేసులో తొలిసారిగా ఇద్దరికి ఊరట లభించింది. ముంబైలోని ప్రత్యేక ఎన్డీపీఎస్ కోర్టు మంగళవారం మనీశ్ రాజ్గరియా, అవిన్ సాహూకు బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 2న ఆర్యన్ ఖాన్‌తో పాటూ అరెస్టైన పలువురిలో వారిద్దరు కూడా ఉన్నారు. పార్టీకి వచ్చిన వారిలో మనీశ్, సాహూ కూడా అతిథులుగా ఉన్నారని ఎన్సీబీ చెబుతోంది.


ఆర్యన్ ఖాన్ అరెస్ట్ కేసులో మొత్తం 20 మందిని అదుపులోకి తీసుకుంది నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. వారిలో ఇప్పుడు ఒడిషాకి చెందిన మనీశ్, సాహూలకు బెయిల్ లభించగా బాంబే హైకోర్టులో కింగ్ ఖాన్ తనయుడి బెయిల్ పిటీషన్ విచారణలో ఉంది. బుధవారం వాదనలు కొనసాగనున్నాయి. ప్రత్యేక కోర్టు సేమ్ కేసులో ఇద్దరు నిందితులకి బెయిల్ ఇవ్వటంతో ఆర్యన్ విడుదలపైన కూడా బాలీవుడ్‌లో ఆశలు చిగురిస్తున్నాయి. కాకపోతే, జూనియర్ ఖాన్ భవితవ్యం బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచీ జరిగే విచారణలో తేలనుంది. అప్పటి వరకూ ఫ్యాన్స్‌కి సస్పెన్స్ తప్పదు...  

Updated Date - 2021-10-27T01:28:08+05:30 IST