ఈసారి త్రివిక్రమ్ హీరోయిన్ని మారుస్తున్నాడా?
ABN , First Publish Date - 2021-07-07T02:39:02+05:30 IST
త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాలలో నటించే హీరోయిన్ల విషయంలో సెంటిమెంట్ని బ్రేక్ చేస్తున్నాడా? అంటే వినిపిస్తున్న వార్తల ప్రకారం అవునని చెప్పక తప్పదు. ఎందుకంటే 'అత్తారింటికి దారేది' మొదలుకుని 'అఆ' వరకు వరుసగా
త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాలలో నటించే హీరోయిన్ల విషయంలో సెంటిమెంట్ని బ్రేక్ చేస్తున్నాడా? అంటే వినిపిస్తున్న వార్తల ప్రకారం అవునని చెప్పక తప్పదు. ఎందుకంటే 'అత్తారింటికి దారేది' మొదలుకుని 'అఆ' వరకు వరుసగా మూడు సినిమాలలో సమంతకు చోటిచ్చిన త్రివిక్రమ్.. ఆ తర్వాత పవన్ కల్యాణ్తో చేసిన 'అజ్ఞాతవాసి' సినిమా కోసం ఫ్రెష్గా కీర్తిసురేష్, అను ఇమ్మాన్యుయేల్లను తీసుకున్నారు. ఆ సినిమా తర్వాత చేసిన రెండు సినిమాలలోనూ హీరోయిన్ పూజా హెగ్డేకే ఆయన స్థానం కల్పించారు. 'అరవింద సమేత', 'అల వైకుంఠపురములో' చిత్రాల్లో పూజా హెగ్డేని రిపీట్ చేసిన త్రివిక్రమ్.. ఇప్పుడు మహేష్తో చేయబోయే సినిమాకు కూడా పూజానే రిపీట్ చేయబోతున్నాడనేలా వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. సమంతలా.. పూజాతో కూడా త్రివిక్రమ్ హ్యాట్రిక్ ట్రై చేస్తున్నాడనేలా ఒకవైపు వార్తలు వైరల్ అవుతుంటే.. మరోవైపు మహేష్తో చేసే మూవీ కోసం ఈసారి ఆయన హీరోయిన్ని మారుస్తున్నట్లుగా, సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తున్నట్లుగా కూడా వార్తలు టాలీవుడ్ సర్కిల్స్లో వినవస్తున్నాయి.
మహేష్ కోసం కొత్తగా ఈసారి నయనతారను సెట్ చేసేందుకు త్రివిక్రమ్ చూస్తున్నాడనేలా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్లో చిరు సరసన 'సైరా'లో నటించిన నయన్.. మళ్లీ టాలీవుడ్లో డైరెక్ట్ సినిమా చేయలేదు. ఈ మధ్యకాలంలో ఆమె తీరు చూస్తే.. అసలు టాలీవుడ్లో చేసే ఉద్దేశ్యం తనకి లేదు అనేలా కనిపిస్తోంది. అలాంటి నయన్ ఇప్పుడు మహేష్ కోసం మళ్లీ టాలీవుడ్లో అడుగుపెడుతుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి వినిపిస్తున్న ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.