మెగాస్టార్ సరసన మళ్ళీ త్రిష?

ABN , First Publish Date - 2022-01-25T13:45:46+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో జోరుమీదున్నారు. ‘ఆచార్య’ విడుదలకు సిద్ధం కాగా, ‘గాడ్ ఫాదర్, భోళాశంకర్’, బాబీ దర్శకత్వంలోని చిత్రాలతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఓ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించనున్నారు. ఈ ఏడాదే చిత్రం సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ‘ఛలో, భీష్మ’ చిత్రాలతో మెప్పించిన వెంకీ కుడుముల.. ఇప్పుడు చిరంజీవితో కూడా ఓ కామెడీ ఎంటర్ టైనర్ ను రెడీ చేస్తున్నారు. ముందుగా ఈ మూవీ కథానాయికగా శ్రుతి హాసన్ పేరు వినిపించింది.

మెగాస్టార్ సరసన మళ్ళీ త్రిష?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో జోరుమీదున్నారు. ‘ఆచార్య’ విడుదలకు సిద్ధం కాగా, ‘గాడ్ ఫాదర్, భోళాశంకర్’, బాబీ దర్శకత్వంలోని చిత్రాలతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఓ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించనున్నారు. ఈ ఏడాదే చిత్రం సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ‘ఛలో, భీష్మ’ చిత్రాలతో మెప్పించిన వెంకీ కుడుముల.. ఇప్పుడు చిరంజీవితో కూడా ఓ కామెడీ ఎంటర్ టైనర్ ను రెడీ చేస్తున్నారు. ముందుగా ఈ మూవీ కథానాయికగా శ్రుతి హాసన్ పేరు వినిపించింది. అయితే ఇప్పుడు సీనియర్ హీరోయిన్ త్రిష కథానాయికగా ఫిక్స్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 


త్రిష.. చిరు సరసన గతంలో ‘స్టాలిన్’ చిత్రంలో కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా 2006లో వచ్చింది. మళ్ళీ పదహారేళ్ళ తర్వాత మరోసారి ఈ జోడీ అభిమానుల్ని అలరించనుండడం విశేషమని చెప్పాలి. దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. వెంకీ కథ చిరును బాగా ఇంప్రెస్ చేసిందట. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం త్రిష..  హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్, వెబ్ సిరీస్ తో బిజీగా ఉంది. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో చూడాలి. 

Updated Date - 2022-01-25T13:45:46+05:30 IST