ఆ ఫొటోలు లీక్ అయ్యాయి
ABN , First Publish Date - 2021-09-07T06:48:47+05:30 IST
నయనతార ప్రస్తుతం ఓ హిందీ చిత్రం షూటింగ్ కోసం పూనేలో ఉన్నారు. షారుఖ్ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు....
నయనతార ప్రస్తుతం ఓ హిందీ చిత్రం షూటింగ్ కోసం పూనేలో ఉన్నారు. షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార నటిస్తున్న తొలి హిందీ చిత్రం ఇదే. ఈ సినిమాకు జవాన్ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇందులో షారుఖ్ ఖాన్, నయనతార పాల్గొన్న యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన రెండు ఫొటోలు లీక్ అయి, సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి.
మూడేళ్ల నుంచీ షారుఖ్ ఖాన్ , అట్లీ ఓ సినిమా చేయాలని అనుకుంటున్నారు. ఈ కాంబినేషన్ ఇప్పటికి సెట్ అయింది. హీరోయిన్గా నయనతారను ఎంపిక చేయడంతో ఈ ప్రాజెక్ట్కు క్రేజ్ మరింత పెరిగింది.