'రాధేశ్యామ్' ఒప్పుకోవడానికి కారణం ఇదే

ABN , First Publish Date - 2022-01-24T13:22:55+05:30 IST

మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ పాన్ ఇండియన్ సినిమా 'రాధేశ్యామ్' ఎందుకు ఒప్పుకున్నారో తాజాగా వెల్లడించారు. ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న

'రాధేశ్యామ్' ఒప్పుకోవడానికి కారణం ఇదే

మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ పాన్ ఇండియన్ సినిమా 'రాధేశ్యామ్' ఎందుకు ఒప్పుకున్నారో తాజాగా వెల్లడించారు. ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాకు బాలీవుడ్, కోలీవుడ్ సంగీత దర్శకులు పాటలకు సంగీతం అందించిన సంగతి తెలిసిందే. అయితే సడన్‌గా, మేకర్స్ సౌత్ వెర్షన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించే బాధ్యత మాత్రం థమన్‌కు అప్పగించారు. బాలీవుడ్‌లో మూడు సినిమాలు చేసిన ఈ మ్యూజిక్ డైరెక్టర్..అక్కడ కల్చర్ నచ్చకనే కంటిన్యూ కాలేకపోయాయని స్వయంగా వెల్లడించారు.


సాంగ్స్ ఒకరు, బీజీఎం ఒకరు ఎలా చేస్తారంటూ కామెంట్స్ చేశారు. అలా చెప్పిన కొన్ని రోజులకే  'రాధేశ్యామ్' చిత్రానికి కేవలం బీజీఎం అందించేందుకు ఒప్పుకున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీనికి కారణం ఏంటో తెలిపారు థమన్. 'అఖండ' చిత్రం తర్వాత నా నుండి ప్రతి ఒక్కరు మాస్ బీట్స్‌ను ఆశిస్తున్నారు. నేనిస్తున్న బీజీఎం లౌడ్‌గా ఉంటుంది. మాస్ యాక్షన్ సన్నివేశాలకు మాత్రమే థమన్ సెట్ అవుతాడని డిసైడైపోయారు. నాపై ఉన్న ఆ ఇమేజ్ మార్చుకోవాలనే ఉద్దేశ్యంతో 'రాధేశ్యామ్' సినిమాకు బీజీఎం అందించేందుకు సైన్ చేశాను.. అని తెలిపారు. మరి థమన్ మీద ఉన్న ఆ ఇమేజ్‌ను 'రాధేశ్యామ్'తో తుడిచేస్తారా లేదా చూడాలి. 

Updated Date - 2022-01-24T13:22:55+05:30 IST