విశాల్ ‘ఎనిమి’కి థియేటర్ల కష్టాలు?
ABN , First Publish Date - 2021-10-24T02:48:21+05:30 IST
విశాల్ - ఆర్య నటించిన ‘ఎనిమి’ చిత్రానికి థియేటర్ల కష్టాలు ఎదురయ్యాయి. దీపావళి సందర్భంగా నవంబరు 4న ఈ మూవీని రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ, అదే రోజున సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన
విశాల్ - ఆర్య నటించిన ‘ఎనిమి’ చిత్రానికి థియేటర్ల కష్టాలు ఎదురయ్యాయి. దీపావళి సందర్భంగా నవంబరు 4న ఈ మూవీని రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ, అదే రోజున సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన ‘అన్నాత్త’ చిత్రం విడుదలవుతోంది. రాష్ట్రంలోని అన్ని స్ర్కీన్లలో ఈ సినిమా విడుదల చేసేలా సన్ పిక్చర్స్ ప్లాన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇతర చిత్రాలకు థియేటర్లు లభించడం కష్టంగా మారింది.
అందుకే దీపావళి రేస్ నుంచి శింబు నటించిన ‘మానాడు’ తప్పుకుంది. ఇపుడు విశాల్ - ఆర్యల ‘ఎనిమి’ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఈ పరిస్థితుల్లో తమకు రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 250 స్ర్కీన్లు కేటాయించాలని తమిళనాడు చిత్ర నిర్మాతల మండలికి ‘ఎనిమి’ చిత్ర నిర్మాత విఙ్ఞప్తి చేసినట్టు ఆడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.