యంగ్ డైరెక్టర్ కూడా నిర్మాతగా బిజీ బిజీ

ABN , First Publish Date - 2022-01-11T14:49:48+05:30 IST

యంగ్ డైరెక్టర్ వెంకట్ మాహా నిర్మాతగా కూడా బిజీ బిజీగా ఉన్నారు. 'కేరాఫ్ కంచరపాలెం' సినిమాతో దర్శకుడిగా మారిన వెంకట్ మహా..మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత సత్య దేవ్ హీరోగా రూపొందించిన

యంగ్ డైరెక్టర్ కూడా నిర్మాతగా బిజీ బిజీ

యంగ్ డైరెక్టర్ వెంకట్ మాహా నిర్మాతగా కూడా బిజీ బిజీగా ఉన్నారు. 'కేరాఫ్ కంచరపాలెం' సినిమాతో దర్శకుడిగా మారిన వెంకట్ మహా..మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత సత్య దేవ్ హీరోగా రూపొందించిన 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రం కూడా ఓటీటీలో విడుదలై హిట్ సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇలా దర్శకుడిగా సినిమాలు చేస్తూనే నిర్మాతగానూ మారారు వెంకట్ మహా. ఇప్పటికే  గీతాఆర్ట్స్ 2 పిక్చర్స్ - స్వేచ్ఛ క్రియేషన్స్ సంస్థలతో కలిసి కమెడియన్ సుహాస్ హీరోగా తెరకెక్కుతున్న 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు' అనే మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో దుశ్యంత్ కటికనేని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అలాగే, తన దర్శకత్వంలో యాంగ్రీ హీరో రాజశేఖర్ నటిస్తున్న 'మర్మాణువు' చిత్ర నిర్మాణంలోనూ వెంకట్ మహా భాగస్వామిగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి దర్శకుడిగా సక్సెస్ అయిన ఈ యంగ్ డైరెక్టర్ నిర్మాతగా ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలి.  

Updated Date - 2022-01-11T14:49:48+05:30 IST