పాట పార్థివదేహమైపోయింది: సాయి మాధవ్ బుర్రా
ABN , First Publish Date - 2021-12-01T18:10:52+05:30 IST
పాట పార్థివదేహమైపోయింది అని ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా అన్నారు. ఫిల్మ్ ఛాంబర్లో అభిమానుల సందర్శనార్ధం ఉంచిన సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతిక కాయానికి సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.
పాట పార్థివదేహమైపోయింది అని ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా అన్నారు. ఫిల్మ్ ఛాంబర్లో అభిమానుల సందర్శనార్ధం ఉంచిన సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతిక కాయానికి సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆయన పార్థివ దేహాన్ని దర్శించిన అనంతరం రచయిత సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ.." పాట పార్థివదేహమైపోయింది. మహానుభావుడు.. సాహిత్యం ఎంత గొప్పదో ఆయన వ్యక్తిత్వం అంత గొప్పది. ఆయన గురువు కంటే ఎక్కువ" అని కొనియాడారు.