ఇద్దరు దర్శకుల సందడి
ABN , First Publish Date - 2021-12-06T06:41:20+05:30 IST
ఇద్దరు ప్రముఖ దర్శకులు కలసి తెరను పంచుకోబోతున్నారు. దర్శకుడు మోహన్ జి. రూపొందిస్తున్న తమిళ చిత్రం ‘రుద్రతాండవం’లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు...
ఇద్దరు ప్రముఖ దర్శకులు కలసి తెరను పంచుకోబోతున్నారు. దర్శకుడు మోహన్ జి. రూపొందిస్తున్న తమిళ చిత్రం ‘రుద్రతాండవం’లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో డైరెక్టర్ సెల్వ రాఘవన్ మరో లీడ్ రోల్ పోషిస్తున్నట్టు మోహన్ తెలిపారు. నిజజీవిత ఘటనల ఆధారంగా థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సాని కాయిదమ్’తో సెల్వరాఘవన్ నటుడిగా పరిచయం అవుతున్నారు. అలాగే ఆయన విజయ్ ‘బీస్ట్’ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నారు.