ప్రియాంక, నిక్లే కాదు..సరోగసీ ద్వారా తల్లిదండ్రులైన సెలబ్రెటీల లిస్ట్ ఇదీ..!
ABN , First Publish Date - 2022-01-23T00:19:08+05:30 IST
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ దంపతులు అభిమానులను సర్ప్రైజ్ చేశారు. తాము ఓ బిడ్డకు సరోగేట్ (అద్దెగర్భం) పద్ధతి ద్వారా
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ దంపతులు అభిమానులను సర్ప్రైజ్ చేశారు. తాము ఓ బిడ్డకు సరోగేట్ (అద్దెగర్భం) పద్ధతి ద్వారా తల్లిదండ్రులు అయ్యామంటూ శుభవార్త తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వారు నెటిజన్స్తో పంచుకున్నారు. అయితే, గతంలో అనేక మంది సెలెబ్రిటీలు సరోగసీ ద్వారానే తల్లిదండ్రులయ్యారు. ఆ విధానంలో అమ్మ, నాన్నలైన సెలెబ్రిటీలపై ఓ లుక్కేద్దామా..
షారూక్ ఖాన్ -గౌరీ ఖాన్ :
షారూక్ ఖాన్ - గౌరీ ఖాన్కు గతంలోనే ఇద్దరూ పిల్లలున్నారు. వారి పేర్లు ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్. కొన్నాళ్లకు ఆ దంపతులు మూడో బిడ్డకు తల్లిదండ్రులు కావాలనుకున్నారు. సరోగసీ ద్వారా అబ్రాం అనే పండంటి బిడ్డకు 2013లో వారు స్వాగతం పలికారు.
తుషార్ కపూర్
బాలీవుడ్ దిగ్గజ నటుడు జితేంద్ర కపూర్, శోభా కపూర్ల తనయుడు తుషార్ కపూర్. పలు సినిమాల్లో హీరోగా నటించాడు. అతడు సరోగసీ విధానంలో 2016లో లక్ష్య కపూర్ అనే బాబుకు తండ్రయ్యాడు.
ఏక్తా కపూర్
తుషార్ కపూర్ సోదరే ఏక్తా కపూర్. సోదరుడి బాటలోనే ఆమె కూడా నడవాలని భావించింది. సరోగసీ ద్వారా రవీ అనే బాబుకు ఆమె 2019లో తల్లైంది.
సన్నీ లియోన్-డేనియల్ వెబర్
ఈ దంపతులకు మొదట్లో పిల్లలు లేరు. దీంతో నిషా అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. అనంతరం సరోగసీ ద్వారా 2018లో నొవా, అషర్ అనే పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.
ప్రీతిజింటా-జీన్ గూడ్ఎనఫ్
బాలీవుడ్ నటి ప్రీతిజింటా అమెరికా పారిశ్రామికవేత్త అయిన జీన్ గూడ్ ఎనఫ్ను పెళ్లి చేసుకుంది. ఈ దంపతులు 2021 నవంబర్లో సరోగసీ విధానంలో జై, జియా అనే పిల్లలకు స్వాగతం పలికారు.
కరణ్ జోహార్
బాలీవుడ్లో భారీ తరహా సినిమాలకు పెట్టింది పేరు ధర్మ ప్రొడక్షన్స్. ఆ ప్రొడక్షన్స్ అధినేతే కరణ్ జోహార్. అతడు 2017 ఫిబ్రవరిలో సరోగసీ ద్వారా రూహీ, యశ్కు డాడీ అయ్యారు.
ఆమిర్ ఖాన్- కిరణ్ రావ్
బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్- అతడి మాజీ భార్య కిరణ్ రావ్ 2011లో సరోగసీ ద్వారానే ఆజాద్ అనే బిడ్డకు తల్లిదండ్రులయ్యారు.
శిల్పా శెట్టి -రాజ్ కుంద్రా
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి తనకు అనేక సార్లు గర్భస్రావం అయిందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. రాజ్ కుంద్రాకు శిల్పాశెట్టి రెండో భార్య. మొదటి భార్య ద్వారా కుంద్రాకు ఒక బాబు పుట్టాడు. అనంతరం శిల్పా శెట్టిని పెళ్లి చేసుకున్నాక సరోగెసి ఆప్షన్ ఉపయోగించుకుని 2020లో సమీషా అనే పాపకు వారు తల్లిదండ్రులయ్యారు.