అందుకే నటిగా మారా!

ABN , First Publish Date - 2021-11-23T05:43:15+05:30 IST

రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అనుభవించురాజా’. సుప్రియ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్రీను గవిరెడ్డి దర్శకుడు. ఈ చిత్రంతోనే కశిష్‌ ఖాన్‌ టాలీవుడ్‌కు కథానాయికగా పరిచయం అవుతోంది...

అందుకే నటిగా మారా!

రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అనుభవించురాజా’. సుప్రియ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్రీను గవిరెడ్డి దర్శకుడు. ఈ చిత్రంతోనే కశిష్‌ ఖాన్‌ టాలీవుడ్‌కు కథానాయికగా పరిచయం అవుతోంది. ఈనెల 26న ‘అనుభవించురాజా’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా కశిష్‌ఖాన్‌ మాట్లాడుతూ ‘‘ఇది నా తొలి చిత్రం. నటనలో ఎలాంటి అనుభవం లేదు. నాకు కెమెరా, యాక్షన్‌.. అనే పదాలు కూడా తెలీవు. ఆడిషన్స్‌ ద్వారా ఈ సినిమాకి ఎంపికయ్యా. సెట్లోనే అన్నీ నేర్చుకున్నా. ఈ విషయంలో రాజ్‌తరుణ్‌ అందించిన సహకారం మర్చిపోలేనిది. తొలి సినిమానే అన్నపూర్ణ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో పనిచేయడం గర్వంగా ఉంది. ‘అనుభవించురాజా’ లో నేను పక్కింటి అమ్మాయి తరహా పాత్ర పోషించా. కథ చాలా సరదాగా ఉంటుంది. సెట్లో కూడా అంతే సరదాగా ఉండేది. నవ్వుతూ, నవ్విస్తూ షూటింగ్‌ పూర్తి చేశాం. తెలుగు భాష కాస్త కష్టంగా అనిపించేది. సహాయ దర్శకులతో మాట్లాడడం వల్ల.. తెలుగు కొంచెం కొంచెం నేర్చుకున్నా. ఎలాంటి ప్రామ్టింగ్‌ లేకుండానే సెట్లో డైలాగులు చెప్పా. త్వరలోనే స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతానన్న నమ్మకం కలిగింది. నటన అంటే నాకిష్టం. సినిమా పరిశ్రమ అంటే గౌరవం ఉంది. నిజ జీవితంలో ఒకొక్కరూ ఒక్కోలా ఉంటారు. అదే సినిమా నటి అయితే.. ఒక్కో సినిమాలో ఒక్కోలా ఉండొచ్చు. అందుకే ఈ రంగాన్ని ఎంచుకున్నా. ప్రతీ సినిమాలోనూ ఏదో ఓ కొత్త అనుభవం సంపాదించాలి. అలాంటి పాత్రలే ఎంచుకుంటా’’ అని చెప్పింది. 


Updated Date - 2021-11-23T05:43:15+05:30 IST