ఆ వివాదం త్వరలో సమసిపోతుంది

ABN , First Publish Date - 2022-01-18T05:37:19+05:30 IST

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రకృతి అందాలను త్వరలోనే తెరకెక్కిస్తానని దర్శకుడు వంశీ పైడిపల్లి అన్నారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ వచ్చిన వంశీ...

ఆ వివాదం త్వరలో సమసిపోతుంది

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రకృతి అందాలను త్వరలోనే తెరకెక్కిస్తానని దర్శకుడు వంశీ పైడిపల్లి అన్నారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ వచ్చిన వంశీ సోమవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీలో ప్రభుత్వానికి, సినీరంగానికి మధ్య నెలకొన్న వివాదం త్వరలోనే సమసిపోతుందని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో చిరంజీవి సమావేశమయ్యారని, ఈ అంశంలో ఎవ్వరూ పెద్దగా మాట్లాడవద్దని, త్వరలోనే వివాదం సద్దుమణుగుతుందని సినీరంగ పెద్దలు భావిస్తున్నారన్నారు. ‘మహర్షి’ సినిమా తనకు జీవితంలో మరిచిపోలేని మధురస్మృతులను మిగిల్చిందన్నారు. ఈ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికవ్వడం, తనకు జాతీయ అవార్డు రావడం మాటల్లో చెప్పలేని అనుభూతిని మిగిల్చిందన్నారు. ఆ సినిమా చూసిన తర్వాత భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన ట్విట్‌ తనలో మరింత స్ఫూర్తిని నింపిందన్నారు. తాను ప్రస్తుతం తమిళ్‌లో దళపతి విజయ్‌తో సినిమా చేస్తున్నానని తెలిపారు.

ఆంధ్రజ్యోతి (ఖానాపూర్‌)


Updated Date - 2022-01-18T05:37:19+05:30 IST