sarkaru vaari paata: అవన్నీ రూమర్సేనా..!

ABN , First Publish Date - 2022-01-20T14:05:03+05:30 IST

ఈ మధ్య 'సర్కారు వారి పాట' చిత్రానికి సంబధించి సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చి చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే మళ్ళీ ఇందులోని కొన్ని సీన్స్ రీ షూట్ చేస్తున్నారని. తాజా సమాచారం ప్రకారం అవన్నీ రూమర్సేనట.

sarkaru vaari paata: అవన్నీ రూమర్సేనా..!

ఈ మధ్య 'సర్కారు వారి పాట' చిత్రానికి సంబధించి సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చి చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే మళ్ళీ ఇందులోని కొన్ని సీన్స్ రీ షూట్ చేస్తున్నారని. తాజా సమాచారం ప్రకారం అవన్నీ రూమర్సేనట. సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు పరశురామ్ పెట్లా దర్శకుడు. దుబాయ్, హైదరాబాద్‌లలో ఇప్పటికే మెజారిటీ భాగం చిత్రీకరణ పూర్తి చేశారు. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే, 'సర్కారు వారి పాట' సినిమాకు సంబంధించి ఇప్పటికే పూర్తైన కొన్ని సీన్స్‌ను మళ్ళీ రీషూట్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.


ఇందులో ఎలాంటి వాస్తవం లేదట. ఇప్పటివరకు అలా రీ షూట్ చేసిన సీన్ ఒక్కటి కూడా లేదని తెలుస్తోంది. అంతా పర్‌ఫెక్ట్‌గా జరుగుతున్నప్పుడు రీ షూట్ చేయాలసిన అవసరం ఏముంటుంది..ఇవన్నీ కేవల పుకార్లే అంటూ చిత్రబృందం అంటున్నారట. దీనిని బట్టి చూస్తే రీ షూట్ జరిగిందనే మాట కేవలం రూమర్ మాత్రమే అని అర్థమవుతోంది. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. మహేశ్ సొంత నిర్మాణ సంస్థతో కలిసి 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటివరకైతే ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. 

Updated Date - 2022-01-20T14:05:03+05:30 IST