‘ఆహా’లో ‘తరగతి గది దాటి’.. ఎప్పుడంటే?
ABN , First Publish Date - 2021-08-18T02:03:00+05:30 IST
టీనేజ్ వయసులో ఉండే చిన్న చిన్న వెలకట్టలేని అనందాలు, సంఘర్షణలు, మనసు పడే గందరగోళాలు, సంతోషాలను కిట్టు అనే క్యారెక్టర్ ద్వారా
హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’.. మరో వెబ్ సిరీస్ విడుదల కాబోతోంది. ఈ వెబ్ సిరీస్తో ప్రేక్షకులకు వారి పాత జ్ఞాపకాలను గుర్తు చేయబోతుంది. అదెలా అనుకుంటున్నారా? ‘తరగతి గది దాటి’ అనే వెబ్ సిరీస్తో తెలియని ఓ పిచ్చి ఇష్టం, అమాయకత్వంతో కూడిన ఫస్ట్ లవ్ను ప్రేక్షకులకు ‘ఆహా’ పరిచయం చేయనుంది. టి.వి.ఎఫ్ వారి ఒరిజినల్ ‘ఫ్లేమ్స్’ను తెలుగులో ‘తరగతి గది దాటి’ అనే పేరుతో ఐదు ఎపిసోడ్స్తో వెబ్ సిరీస్గా రీమేక్ చేసింది ‘ఆహా’. ఈ వెబ్ సిరీస్ను ‘పెళ్లిగోల’ ఫేమ్ మల్లిక్ రామ్ డైరెక్ట్ చేశారు. హర్షిత్ రెడ్డి, పాయల్ రాధాకృష్ణ, నిఖిల్ దేవాదుల ప్రధాన పాత్రల్లో నటించిన ‘తరగతి గది దాటి’ వెబ్ సిరీస్ను ఆగస్ట్ 20 నుంచి గ్లోబల్ ప్రీమియర్గా ప్రసారం చేయబోతున్నట్లుగా ‘ఆహా’ ప్రకటించింది. హృదయానికి ఓ ఫీల్ను కలిగించేలా, ఫన్నీగా ఉండే ఈ టీనేజ్ రొమాంటిక్ వెబ్ సిరీస్ ట్రైలర్ను ‘ఆహా’ విడుదల చేసింది.
స్టోరీ ఇదే..
రాజమండ్రిలో ట్యూషన్స్ చెప్పే దంపతులు.. వారి కుమారుడే కృష్ణ అలియాస్ కిట్టు. అతను సిన్సియర్ స్టూడెంట్ కానీ చదువు వంటపట్టదు. అతనికి వంట చేయడంపై ఆసక్తి ఉంటుంది. మంచి చెఫ్ కావాలని అనుకుంటుంటాడు. అయితే ‘జీవితమంటే జోక్ కాదు’ అంటూ అతని తండ్రి అతన్ని నిరుత్సాహపరుస్తుంటాడు. అదే సమయంలో ఆ ట్యూషన్ సెంటర్కు వచ్చిన జాస్మిన్ అనే అమ్మాయిని చూసి కృష్ణ ప్రేమలో పడతాడు. ఇద్దరూ సరదాగా క్లాసులను ఎగ్గొట్టి తిరుగుతుంటారు. కిట్టు ప్రేమను వ్యక్తం చేయడానికి, అతని స్నేహితులు కూడా అతనికి టిప్స్ చెబుతారు. మరి వారి ప్రేమ ఎంత దూరం వెళుతుంది? అనేదే కథ. టీనేజ్ వయసులో ఉండే చిన్న చిన్న వెలకట్టలేని అనందాలు, సంఘర్షణలు, మనసు పడే గందరగోళాలు, సంతోషాలను కిట్టు అనే క్యారెక్టర్ ద్వారా ఈ వెబ్ సిరీస్లో చూపించబోతున్నారు.