తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు: హీరో ఆశిష్

ABN , First Publish Date - 2022-01-22T18:42:36+05:30 IST

తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు అని 'రౌడీ బాయ్స్' చిత్ర హీరో ఆశిష్ అన్నారు. తాజాగా ఈ హీరో..దర్శకులు శ్రీహర్ష, పరుశురాంలతో కలిసి తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు చేరుకున్న

తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు: హీరో ఆశిష్

తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు అని 'రౌడీ బాయ్స్' చిత్ర హీరో ఆశిష్ అన్నారు. తాజాగా ఈ హీరో..దర్శకులు శ్రీహర్ష, పరుశురాంలతో కలిసి తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు చేరుకున్న వీరు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా, ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 


'రౌడీ బాయ్స్' చిత్రం విజయం సాధించడంతో శ్రీవారి ఆశీస్సులు పొందామని...చిత్రాన్ని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలని హీరో ఆశిష్ తెలిపారు. ప్రస్తుతం దర్శకుడు సుకుమార్, ఎస్వీసి బ్యానర్ సంయుక్తంగా నిర్మించనున్న 'సెల్ఫిష్' అనే మరో చిత్రంలో నటిస్తున్నానని..త్వరలోనే 'సెల్ఫీష్' సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియ చేస్తామన్నారు. సినిమా టికెట్ల ధరల విషయం మాట్లాడే అంత పెద్దవాడిని నేను కానని ఆశీష్ సమాధానం చెప్పారు.  

Updated Date - 2022-01-22T18:42:36+05:30 IST