Tamannaah: మెరిసిపోతున్న మిల్కీ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ వైరల్..

ABN , First Publish Date - 2021-12-03T15:10:39+05:30 IST

మెరిసిపోతున్న మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సౌత్ సినిమా ఇండస్ట్రీలో పదేళ్ళకు పైగా కొసనసాగుతున్న స్టార్ హీరోయిన్స్‌లో తమన్నా ఒకరు.

Tamannaah: మెరిసిపోతున్న మిల్కీ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ వైరల్..

మెరిసిపోతున్న మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సౌత్ సినిమా ఇండస్ట్రీలో పదేళ్ళకు పైగా కొసనసాగుతున్న స్టార్ హీరోయిన్స్‌లో తమన్నా ఒకరు. ఆమె క్రేజ్ అండ్ పాపులారిటీ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. నితిన్, సత్యదేవ్ లాంటి యంగ్ హీరోలతో జత కడుతూనే మెగాస్టార్ చిరంజీవి లాంటి సీనియర్ హీరోల సినిమాలలోనూ అవకాశాలు అందుకుంటున్నారు. అలాగే ఫ్యాషన్ షోస్‌లోనూ సందడి చేస్తూ మైమరపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తమన్నా ఆకర్షణీయమైన దుస్తులలో ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. ట్రాన్స్ వుమన్ సైషా షిండే డిజైన్ చేసిన ఎరుపు, నీలి రంగు థై స్లిట్ దుస్తులను ఆమె ఎంచుకుంది. ఇందులో తళ తళా మెరిసిపోతోతున్నారు తమన్నా. ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి. కాగా, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'భోళా శంకర్' చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. మెహర్ రమేశ్ దీనికి దర్శకుడు. 

Updated Date - 2021-12-03T15:10:39+05:30 IST