Thaman: ఆ పాట విషయంలో చాలా బాధపడ్దాను..

ABN , First Publish Date - 2021-11-30T14:56:51+05:30 IST

ప్రస్తుతం మ్యూజిక్ సెన్షేషన్‌గా టాలీవుడ్‌లో విపరీతంగా క్రేజ్ ఉన్న సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్. ఇప్పుడు తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తుంది తనే. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పన కళ్యాణ్, బాలకృష్ణ, రవితేజ, మహేశ్ బాబు.

Thaman: ఆ పాట విషయంలో చాలా బాధపడ్దాను..

ప్రస్తుతం మ్యూజిక్ సెన్షేషన్‌గా టాలీవుడ్‌లో విపరీతంగా క్రేజ్ ఉన్న సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్. ఇప్పుడు తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తుంది తనే. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్, బాలకృష్ణ, రవితేజ, మహేశ్ బాబు.. ఇలా దాదాపు అన్నీ పెద్ద హీరోల సినిమాలే థమన్ చేతిలో ఉన్నాయి. 'అల వైకుంఠపురములో' దగ్గర్నుంచి థమన్ దూకుడు బాగా జోరందుకుంది. తను కంపోజ్ చేస్తున్న సాంగ్స్ యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబట్టి ట్రెండింగ్‌లో నిలిస్తున్నాయి. అయితే, థమన్ ఎంతో నమ్మకంగా మంచి హిట్ అవుతుందనుకున్న ఓ సాంగ్ మాత్రం తనని బాగా డిసప్పాయింట్ చేసిందని తాజాగా వెల్లడించాడు. త్రిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్, పూజా హెగ్డే జంటగా 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం వచ్చి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో 'యాడబోయినాడో' అనే పాట కోసం ఎంతో శ్రమించాడట. వైజాగ్ నుంచి నికిత అనే అమ్మాయిని పిలిపించి ఆ పాటను పాడించాడు. ఈ పాట ట్యూన్ గానీ, పాడటం గానీ కష్టమట. ఇలాంటి పాటను ఎంతో కష్టపడి కంపోజ్ చేశాను. మంచి హిట్ అవుతుందనుకున్నా. కానీ, నన్ను ఈ పాట చాలా నిరుత్సాహపరచింది అని తాజాగా థమన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. కాగా, ప్రస్తుతం థమన్ 'సర్కారు వారి పాట', 'భీమ్లా నాయక్', 'గాడ్ ఫాదర్', 'అఖండ' సహా పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌కు సంగీతం అందిస్తున్నాడు. 

Updated Date - 2021-11-30T14:56:51+05:30 IST