సరోగసీపై వరుస ట్వీట్స్ చేసిన తస్లీమా నస్రీన్.. నిక్, ప్రియాంకలను ఉద్దేశించి కాదంటూ వివరణ..

ABN , First Publish Date - 2022-01-25T02:06:32+05:30 IST

ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ కొన్ని రోజుల క్రితం సరోగసీ ద్వారా తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే.

సరోగసీపై వరుస ట్వీట్స్ చేసిన తస్లీమా నస్రీన్.. నిక్, ప్రియాంకలను ఉద్దేశించి కాదంటూ వివరణ..

ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ కొన్ని రోజుల క్రితం సరోగసీ ద్వారా తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. కొత్తగా తల్లిదండ్రలు కావడంతో వారికి అన్ని వైపులా నుంచి శుభాకాంక్షలు వెలువెత్తాయి. కానీ, బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ సరోగసీకి వ్యతిరేకంగా అనేక ట్వీట్లను చేయడంతో తీవ్ర దుమారం చెలరేగింది. నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. అయితే.. తస్లీమా మాత్రం ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్‌లను ఉద్దేశించి ఆ ట్వీట్లను చేయలేదని చెబుతోంది. ఆ దంపతులంటే తనకు ఇష్టమని ఆమె పేర్కొంటోంది. 


ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ సరోగసీ ద్వారా తల్లిదండ్రులైనట్టు ప్రకటించిన మరుసటి రోజే దానికి వ్యతిరేకంగా వరుసగా ఆమె ట్వీట్లను చేసింది. ‘‘ సరోగసీ ద్వారా రెడీమేడ్ బేబీలను పొందినవారు ఎలాంటి అనుభూతిని పొందుతారు. జన్మనిచ్చిన తల్లుల మాదిరి అనుభూతిని అనుభవిస్తారా?’’ అని తస్లీమా నస్రీన్ ట్వీట్ చేసింది. ‘‘ పేద మహిళలు ఉండటంతోనే సరోగసీ సాధ్యమవుతోంది. ధనవంతులు సొంత ప్రయోజనాల కోసం సమాజంలో ఎల్లప్పుడు పేదరికం ఉండాలని కోరుకుంటారు. మీకు పిల్లలు కావాల్సి వస్తే అనాథను దత్తతను తీసుకుండి. పిల్లలు మీ లక్షణాలను వారసత్వంగా పొందాలి’’ అని మరో ట్వీట్‌లో ఆమె పేర్కొంది.      


‘‘ధనవంతులైన మహిళలు సరోగేట్ మామ్‌గా మారనంతవరకు నేను సరోగసీని ఒప్పుకొను. పురుషులు బుర్ఖాను వేసుకొనంత వరకు నేను దానిని సమర్థించను. సరోగసీ, బుర్ఖా అనేవి పేదలు,మహిళలను దోపిడి చేసేందుకే ’’ అని తస్లీమా నస్రీన్ ట్విట్టర్‌లో పేర్కొంది. సరోగసీపై ఆమె చేసిన ట్వీట్స్ వైరల్ గా మారాయి. దీంతో ప్రియాంక దంపతులనులను ఉద్దేశించి ఆ ట్వీట్ లను చేయలేదని ఆమె ట్విట్టర్‌లో వివరణ ఇచ్చుకుంది. ‘‘ సరోగసీపై నేను భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశాను. ఆ ట్వీట్స్‌తో ప్రియాంక, నిక్ జోనాస్‌కు సంబంధం లేదు. ఆ దంపతులంటే నాకు ఇష్టం’’ అని తస్లీమా నస్రీన్ చెప్పింది.









Updated Date - 2022-01-25T02:06:32+05:30 IST